Nakka Anandbabu: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం.. టీడీపీ ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరుగుతోందని, చర్యలు తీసుకోవాలని టీడీపీ ఫిర్యాదుచేసింది. అమరావతిలోని సచివాలయంలో ఎన్నికల సంఘాన్ని కలిసింది టీడీపీ బృందం. ఏపీలో జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ అవకతవకలకు పాల్పడుతోందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది టీడీపీ. అధికార పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టడంతో పాటు ఓట్లనే తారుమారు చేస్తుందని ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిశారు మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, ఎమ్మెల్సీ అశోక్ బాబు.
Read Also: CM KCR: మళ్ళీ వస్తా… ఆలయ అభివృద్ధి, విస్తరణపై సమీక్ష నిర్వహిస్తా
Also Read
- Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
- Geetu Mohandas: "నేను రాసిందొకటి.. తీసిందొకటి".. టాక్సిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. కానీ..
- OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అవకతవకలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. అధికార పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేసేందుకే ఎమ్మెల్సీ కల్పన రెడ్డి భర్త ప్రతాప్ రెడ్డిని విద్యాశాఖ కడప ఆర్జేడీగా ప్రభుత్వం నియామకం చేసింది. కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అధికార దుర్వినియోగానికి పాల్పడి తన భార్య కల్పనా రెడ్డిని.. ప్రతాప్ రెడ్డి గెలిపించుకున్నాడు. ఇదే విధానాన్ని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రతాప్ రెడ్డిని వాడుకుంటోంది.
ఫిర్యాదుపై ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందిస్తుందని నమ్మకం ఉంది. ప్రతాప్ రెడ్డిని విద్యాశాఖ కడప ఆర్జేడీగా విధుల నుంచి తొలగించాలని ఎన్నికల ప్రధాన అధికారి మీనాను కోరాం. తిరుపతి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనర్హులను ఓటర్లుగా నమోదు చేశారు. ఇదే అంశాన్ని గతంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకున్నారని ఎన్నికల సంఘాన్ని అడిగాం. ఓసారి సమీక్షించామని మళ్లీ సమీక్షించి చర్యలు తీసుకుంటామని మీనా తెలిపారు.
Read Also: Prattipadu TDP:ప్రత్తిపాడు టీడీపీలో విభేదాలు… ఏలేశ్వరంలో ఆందోళన
తాజావార్తలు
-
Mandadi Teaser: ‘మండాడి’ టీజర్ చూశారా? సుహాస్, సూరి ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది!
-
Dean Elgar Retirement: క్రికెట్కు గుడ్బై చెప్పిన దక్షిణాఫ్రికా స్టార్.. విరాట్ కోహ్లీతో వివాదం గుర్తుందా?
-
Toxic vs Irumudi : టాక్సిక్ టాక్.. ఇరుముడికి తిరుగులేదు
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Paradise Second Single: ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్.. ఇలాంటి లాంచ్ ఎప్పుడూ చూసి ఉండరు!
ట్రెండింగ్
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?