Tata Tech IPO : 19 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించనున్న టాటా టెక్నాలజీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Tech IPO : టాటా గ్రూప్కు చెందిన టాటా టెక్నాలజీస్ త్వరలో మార్కెట్లోకి IPOను ప్రారంభించబోతోంది. 19 ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ కంపెనీ ఐపీఓ ప్రారంభం కానుంది. దీంతో మార్కెట్లో వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే చాలా మంది ఐపీఓ కోసం సిద్ధమవుతున్నారు. కొందరు డబ్బులు గుంజుతున్నారు. కొందరు ఎన్ని షేర్లు కొనుగోలు చేయవచ్చో ప్లాన్ చేయడం మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన సమాచారం ఇంకా బయటకు రానప్పటికీ గ్రే మార్కెట్ లో ఈ షేర్ ఊపందుకుంది. ఇంతకుముందు టాటా కన్సల్టెన్సీ (TCS ) IPO జూలై, 2004లో ఉంది. టాటా టెక్నాలజీ IPO పట్ల ఇన్వెస్టర్లు ఉత్సాహంగా ఉన్నారు.
Read Also:Ankitha : ఆ సినిమా నిరాశ పరచడంతో సినిమాలకు దూరం అయ్యాను..
Also Read
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
టాటా టెక్నాలజీస్ IPO గ్రే మార్కెట్లో ఒక్కో షేరుకు 100 రూపాయల GMP వద్ద ప్రారంభమవుతుంది. అన్లిస్టెడ్ సెక్యూరిటీల సమాచారం ప్రకారం, కొనుగోలుదారులు రూ.750 స్థాయిలో ఆశిస్తున్నారు. టాటా టెక్నాలజీస్ ఈ ఏడాది మార్చి నెలలో సెబీకి అన్ని IPO సంబంధిత పత్రాలను దాఖలు చేసింది. ఈ ఇష్యూ ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద వస్తుంది. కంపెనీలో ఇప్పటికే ఉన్న వాటాదారులు మాత్రమే తమ వాటాలను విక్రయిస్తారు. స్టాక్ మార్కెట్లో ఆఫర్ ఫోర్ సేల్ కింద కంపెనీ వాటాదారులు 9.57 కోట్ల యూనిట్లను విక్రయించనున్నారు. ఇది కంపెనీ పెయిడ్ అప్ స్టాక్ క్యాపిటల్లో 23.60 శాతం అవుతుంది. టాటా మోటార్స్ తన IPO ద్వారా 81,133,706 షేర్లను విక్రయించాలని ప్రతిపాదించింది. ఇందులో ఆల్ఫా టీసీ హోల్డింగ్స్ పీటీఈ 97.16 లక్షల షేర్లను (2.40%), టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ 48.58 లక్షల ఈక్విటీ షేర్లను (1.20%) విక్రయించాలని యోచిస్తోంది.
Read Also:Prabhas: ‘సలార్’ నుంచి నెక్స్ట్ వచ్చే కంటెంట్ ఇదే…
టాటా టెక్నాలజీస్ IPO రాబోయే 5-6 నెలల్లో మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. మార్చి నెలలో కంపెనీ దాఖలు చేసిన ప్రతిపాదనకు సెబీ ఆమోదం తెలిపింది. టాటా గ్రూప్ కంపెనీ అయిన టాటా మోటార్స్ త్రైమాసిక ఫలితాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈసారి కంపెనీ పటిష్ట పనితీరు కనబరుస్తుందని అంచనా వేస్తున్నారు. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ 2025 ఆర్థిక సంవత్సరం నాటికి టాటా మోటార్స్ రుణ విముక్తమవుతుందని అంచనా వేసింది. ఈ స్టాక్ను కొనుగోలు చేయాలని ఈ బ్రోకరేజ్ సంస్థ సూచించింది. ఈ స్టాక్ను కొనుగోలు చేయడం లాభదాయకమైన గణనగా విశ్లేషకులు భావిస్తున్నారు. టాటా కంపెనీపై పెట్టుబడిదారులకు అపారమైన నమ్మకం ఉంది. ఈ స్టాక్ మరికొద్ది రోజుల్లో లాభాలను తెచ్చిపెడుతుందని అంటున్నారు. ఇది పెట్టుబడిదారులకు భారీ ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది.
తాజావార్తలు
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్స్టాప్ షూటింగ్
-
Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
-
Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!