తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ నిందితుడు, టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. చంచల్ గూడా జైల్లో ఉన్న రాధాకృష్ణ రావును పీటీ వారెంట్ పై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ ల్యాండ్ వ్యవహారంలో వ్యాపారవేతను బెదిరించినదుకు జూబ్లీహిల్స్ లో రాధ కిషన్ పై కేసు నమోదైంది. అంతేకాకుండా.. కంపెనీ వ్యవహారంలో రాధా కిషన్ రావు జోక్యం చేసుకొని సెటిల్మెంట్ చేశారని ఆరోపణలు వచ్చాయి. రూ. 150 కోట్ల కంపెనీని తక్కువ ధరకు మరొకరికి ఇప్పిచ్చారని రాధాకృష్ణన్ రావు పై ఫిర్యాదు నమోదైంది.