Tamilnadu: తమిళనాడులో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 800 మంది.. స్కూల్స్, బ్యాంకులు బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu: హిందూ మహాసముద్రంలోని కేప్ కొమొరిన్ సమీపంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో ఆదివారం నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా శ్రీవైకుంటంలో వరదల కారణంగా దాదాపు 800 మంది రైల్వే ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఆలయ పట్టణం తిరుచెందూర్ నుండి చెన్నైకి వెళ్లే ఎక్స్ప్రెస్ రైలులోని ప్రయాణికులు నిన్నటి నుండి వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతమైన శ్రీవైకుంటం వద్ద చిక్కుకుపోయారు. తూత్తుకుడిలో ఇప్పటివరకు 525 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
భారీ వర్షాలు, వరదల కారణంగా శ్రీవైకుంటంలో రైల్వే లైన్ కింద మట్టి కోతకు గురైంది. సిమెంట్ స్లాబ్కు అమర్చిన ఇనుప పట్టాలు దానికి వేలాడుతూ ఉన్నాయి. చిక్కుకుపోయిన ప్రయాణికులను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎన్డిఆర్ఎఫ్ అధికారులు బాధ్యతలు స్వీకరించారని ఒక అధికారి తెలిపారు. తిరుచెందూర్-చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ (రైలు నంబర్ 20606) డిసెంబర్ 17న రాత్రి 8.25 గంటలకు తిరుచెందూరు నుండి చెన్నైకి బయలుదేరింది. భారీ వర్షాలు, వరదల కారణంగా తిరుచెందూర్కు 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీవైకుంటం రైల్వే స్టేషన్లో రైలు నిలిచిపోయింది.
Also Read
- ICC సంచలన నిర్ణయం.! మహిళల టీ20 ప్రపంచకప్ విజేతకు భారీగా నగదు బహుమతి ప్రకటన.!
- iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
- AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
- AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
Read Also:Chandrababu Bail: నేడు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ
మొత్తం 800 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారని, వారిలో 500 మంది శ్రీవైకుంటం రైల్వే స్టేషన్లో, 300 మంది సమీపంలోని పాఠశాలల్లో ఉంటున్నారని ఆయన చెప్పారు. తిరునెల్వేలి-తిరుచెందూర్ సెక్షన్లోని శ్రీవైకుంటం-సెడుంగనల్లూర్ మధ్య రైలు పట్టాలు వరదల్లో పూర్తిగా మునిగిపోవడంతో రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. రానున్న 24 నుంచి 48 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షం, వరదల దృష్ట్యా దక్షిణ రైల్వే 15 రైళ్లను రద్దు చేయగా, పలు రైళ్ల మార్గాలను మార్చింది. తుపాను కారణంగా విమానాల రాకపోకలపై కూడా ప్రతికూల ప్రభావం పడింది. ఈరోజు దక్షిణాది జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు మూతపడ్డాయి. తిరునెల్వేలి, టుటికోరిన్, తెన్కాసి మరియు కన్యాకుమారిలలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. వరదల కారణంగా ఈ జిల్లాల్లో ఇప్పటివరకు 7500 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ జిల్లాల్లో రాష్ట్ర విపత్తు సహాయ దళం, జాతీయ విపత్తు సహాయ దళానికి చెందిన 250 మందికి పైగా సిబ్బందిని మోహరించింది. దక్షిణ తమిళనాడులోని 39 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, దక్షిణ తమిళనాడులో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ బులెటిన్లో తెలిపింది. డిసెంబర్ 19న కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Read Also:Andrapradesh : జైలు బయట తల్లి కోసం వెక్కి వెక్కి ఏడ్చిన చిన్నారి.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
తాజావార్తలు
-
ICC సంచలన నిర్ణయం.! మహిళల టీ20 ప్రపంచకప్ విజేతకు భారీగా నగదు బహుమతి ప్రకటన.!
-
AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Sing Geetham : వెండితెరపై సింగీతం రాసిన చందమామ కథ
-
AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
ట్రెండింగ్
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!