Tamil Nadu Minister: పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న మంత్రి.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Minister: తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ నేతలు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం కూర్చోవడానికి కుర్చీ తీసుకురాలేదని పార్టీ కార్యకర్తలపై మంత్రి ఎస్ఎం నాజర్ రాయి విసిరిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడు మున్సిపల్ శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ పార్టీ కార్యకర్తను మెడపట్టి నెట్టేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమిళనాడులోని సేలంలో ఓ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలను కలిసేందుకు రాష్ట్ర యువజన శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్టేజ్పై నిలుచున్నారు. కార్యకర్తలు వరుసగా ఉదయనిధిని కలిసి కరచాలనం చేస్తున్నారు. ఓ కార్యకర్త వరుసలో వస్తూ స్టాలిన్తో కరచాలనం చేసేందుకు ముందుకు వచ్చాడు. అక్కడే ఉన్న మంత్రి కేఎన్ నెహ్రూ స్టాలిన్తో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నించిన పార్టీ కార్యకర్తను నెట్టడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. గురువారం రాష్ట్ర మంత్రిగా ఉదయనిధి తొలి పర్యటన సందర్భంగా పార్టీ సేలం తూర్పు జిల్లా విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనేక మంది కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
- FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
- Ragi Jaggery Cookies Recipe: మైదాకు గుడ్బై.. ఇంట్లోనే హెల్తీ రాగి-బెల్లం కుకీస్ తయారు చేయండిలా..
PM Narendra Modi: స్టూడెంట్ అడిగిన ‘విమర్శ’ ప్రశ్న.. ‘సిలబస్’ జవాబుతో చమత్కరించిన మోడీ
ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీల నుంచి తక్షణమే విమర్శలు వెల్లువెత్తడంతో పాటు డీఎంకే మంత్రులు ప్రజలను కొట్టేందుకు ప్రతిజ్ఞ చేశారని బీజేపీ రాష్ట్ర చీఫ్ కే అన్నామలై వ్యాఖ్యానించారు. ఈ వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేస్తూ.. “డీఎంకే మంత్రులు ప్రజలను కొట్టడానికి ప్రతిజ్ఞ తీసుకున్నట్లు కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఒక మంత్రి రాళ్లు విసిరారు. మరొక మంత్రి ఇప్పుడు ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇవన్నీ రోజూ ఉంటాయి. . మమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి ఇక్కడ నుంచి మాకు రక్షణ పరికరాలను సరఫరా చేయమని ముఖ్యమంత్రిని అభ్యర్థించండి!” అంటూ అన్నామలై పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నాయకులు, ప్రజలు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Looks like DMK Ministers have taken a pledge to beat up people.
A minister throwing stones a few days back & another minister roughing up people now. All of these on a daily basis
Request @CMOTamilnadu to supply us protective equipments from here on to keep us safer! pic.twitter.com/HNuB0bYXUV
— K.Annamalai (@annamalai_k) January 27, 2023
తాజావార్తలు
-
Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
-
RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
-
Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
-
FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
-
R Ashwin: ముందుగానే చెప్పాలి కదా.. ఇప్పుడు చెప్తే ఎలా.. బీసీసీఐపై అశ్విన్ ఫైర్!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?