CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ప్రభుత్వం నవజాత శిశువులకు ఉచితంగా 1 గ్రాము బంగారు ఉంగరాన్ని అందించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న ‘తై మామన్ తంగ మోదిరమ్’ (మేనమామ బంగారు ఉంగరం) పథకం టెండర్ వ్యవహారం తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. మొత్తం 4,41,667 ఉంగరాల కొనుగోలుకు రూ. 755.83 కోట్ల ఖర్చు అంచనాతో పిలిచిన టెండర్లో 11 ప్రముఖ సంస్థలు పాల్గొన్నాయి. అయితే.. బంగారం ధరను మినహాయించి మేకింగ్, వేస్టేజ్, హాల్మార్కింగ్, బీమా, రవాణా వంటి అదనపు ఖర్చులన్నింటికీ కలిపి ప్రముఖ జువెలరీ సంస్థ జోయ్ అలుక్కాస్ కేవలం ఒక్క పైసా (రూ. 0.01) మాత్రమే కోట్ చేయడం ఈ వివాదానికి మూలంగా మారింది.
ఈ టెండర్ నిబంధనల ప్రకారం అసలు బంగారం ధరను ప్రభుత్వం నాటి IBJA (ఇండియన్ బుల్లియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్) మార్కెట్ రేటు ఆధారంగా విడిగా చెల్లిస్తుంది. పోటీ కేవలం సర్వీస్ ఛార్జీలపైనే జరగడంతో జోయ్ అలుక్కాస్ L1గా నిలిచింది. టెండర్ నిబంధనలను అనుసరించి L1 ధరకు సరఫరా చేసేందుకు మిగిలిన సంస్థలకు అవకాశం ఇవ్వగా, కల్యాణ్ జువెల్లర్స్ మాత్రమే ఆ ఒక్క పైసా ధరకు సమ్మతించింది. దాంతో ప్రభుత్వం జోయ్ అలుక్కాస్కు 70 శాతం, కల్యాణ్ జువెల్లర్స్కు 30 శాతం ఆర్డర్ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read
- Fishermen: 19 రోజులైనా దొరకని మత్స్యకారుల ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..
- CM Chandrababu : చంద్రబాబు ఫుల్ బిజీ.. ఉత్తరాంధ్రలో ఒక్కరోజే 3 జిల్లాలు..
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
ఈ టెండర్ ప్రక్రియపై ప్రతిపక్ష డిఎమ్కె, ఇతర వర్గాలు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. తయారీ, రవాణా, బీమా, హాల్మార్కింగ్ ఖర్చులు భారీగా ఉండే క్రమంలో కేవలం ఒక్క పైసాకే వ్యాపార సంస్థలు ఎలా సరఫరా చేస్తాయనేది ప్రధాన ప్రశ్న. వ్యాపార ప్రయోజనాలు లేకుండా లేదా వేరే రూపంలో లాభం పొందే అవకాశం లేకుండా ఇది సాధ్యం కాదని విమర్శకులు ఆరోపిస్తున్నారు. అయితే.. ఇది ప్రజాసంక్షేమ పథకం కావడంతో ఎలాంటి వ్యాపార లాభాలు ఆశించకుండా సామాజిక బాధ్యతగా ఈ సేవను అందిస్తున్నామని టెండర్ పొందిన సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రభుత్వం కూడా నిబంధనల ప్రకారమే అత్యంత పారదర్శకంగా ఎల్1 ఎంపిక పూర్తి చేశామని వివరణ ఇచ్చింది. రూ. 755 కోట్ల భారీ పథకంలో అసలు బంగారం వ్యయం ప్రభుత్వమే భరిస్తుండగా, ఈ ఒక్క పైసా వ్యూహం వెనుక ఉన్న అసలు కారణాలపై సమగ్ర వివరణ ఇవ్వాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.
తాజావార్తలు
-
CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
-
Gajakesari Yoga 2026 : గజకేసరి యోగం.. ఈ రాశులకు గురు, చంద్రుల కలయికతో లక్ష్మీకటాక్షం.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
-
Fishermen: 19 రోజులైనా దొరకని మత్స్యకారుల ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?