CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ పథకం.. ఒక్క పైసకే గ్రాము బంగారం.. పథకంలో షాకింగ్ ట్విస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ప్రభుత్వం నవజాత శిశువులకు ఉచితంగా 1 గ్రాము బంగారు ఉంగరాన్ని అందించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న ‘తై మామన్ తంగ మోదిరమ్’ (మేనమామ బంగారు ఉంగరం) పథకం టెండర్ వ్యవహారం తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. మొత్తం 4,41,667 ఉంగరాల కొనుగోలుకు రూ. 755.83 కోట్ల ఖర్చు అంచనాతో పిలిచిన టెండర్లో 11 ప్రముఖ సంస్థలు పాల్గొన్నాయి. అయితే.. బంగారం ధరను మినహాయించి మేకింగ్, వేస్టేజ్, హాల్మార్కింగ్, బీమా, రవాణా వంటి అదనపు ఖర్చులన్నింటికీ కలిపి ప్రముఖ జువెలరీ సంస్థ జోయ్ అలుక్కాస్ కేవలం ఒక్క పైసా (రూ. 0.01) మాత్రమే కోట్ చేయడం ఈ వివాదానికి మూలంగా మారింది.
ఈ టెండర్ నిబంధనల ప్రకారం అసలు బంగారం ధరను ప్రభుత్వం నాటి IBJA (ఇండియన్ బుల్లియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్) మార్కెట్ రేటు ఆధారంగా విడిగా చెల్లిస్తుంది. పోటీ కేవలం సర్వీస్ ఛార్జీలపైనే జరగడంతో జోయ్ అలుక్కాస్ L1గా నిలిచింది. టెండర్ నిబంధనలను అనుసరించి L1 ధరకు సరఫరా చేసేందుకు మిగిలిన సంస్థలకు అవకాశం ఇవ్వగా, కల్యాణ్ జువెల్లర్స్ మాత్రమే ఆ ఒక్క పైసా ధరకు సమ్మతించింది. దాంతో ప్రభుత్వం జోయ్ అలుక్కాస్కు 70 శాతం, కల్యాణ్ జువెల్లర్స్కు 30 శాతం ఆర్డర్ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
ఈ టెండర్ ప్రక్రియపై ప్రతిపక్ష డిఎమ్కె, ఇతర వర్గాలు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. తయారీ, రవాణా, బీమా, హాల్మార్కింగ్ ఖర్చులు భారీగా ఉండే క్రమంలో కేవలం ఒక్క పైసాకే వ్యాపార సంస్థలు ఎలా సరఫరా చేస్తాయనేది ప్రధాన ప్రశ్న. వ్యాపార ప్రయోజనాలు లేకుండా లేదా వేరే రూపంలో లాభం పొందే అవకాశం లేకుండా ఇది సాధ్యం కాదని విమర్శకులు ఆరోపిస్తున్నారు. అయితే.. ఇది ప్రజాసంక్షేమ పథకం కావడంతో ఎలాంటి వ్యాపార లాభాలు ఆశించకుండా సామాజిక బాధ్యతగా ఈ సేవను అందిస్తున్నామని టెండర్ పొందిన సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రభుత్వం కూడా నిబంధనల ప్రకారమే అత్యంత పారదర్శకంగా ఎల్1 ఎంపిక పూర్తి చేశామని వివరణ ఇచ్చింది. రూ. 755 కోట్ల భారీ పథకంలో అసలు బంగారం వ్యయం ప్రభుత్వమే భరిస్తుండగా, ఈ ఒక్క పైసా వ్యూహం వెనుక ఉన్న అసలు కారణాలపై సమగ్ర వివరణ ఇవ్వాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..