Tamil Nadu CM: రెండు వేల కోట్ల సాయంగా ఇవ్వాలని ప్రధాని మోడీకి సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీచౌంగ్ తుఫానుతో తమిళనాడు రాష్ట్రం తల్లడిల్లింది. భారీ వర్షాలతో తమిళ ప్రజల విలవిలలాడుతున్నారు. మీచౌంగ్ విపత్తు నుంచి కోలుకుంటుండగానే మరోసారి కుండపోత వాన కురవడంతో దాదాపు సగం రాష్ట్రానికి నరకం చూపించింది. రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. తూత్తుకుడి, కాయల్పట్టివనం, మదురై, విరుదునగరం, తేని జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరో ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతో డ్యామ్లు నిండు కుండల్లా మారి నీటి దిగువకు విడుదల చేయడంతో పరిస్థితి మరింతగా విషమించింది.
Read Also: SRH Full Squad: తెలుగు ఆటగాళ్లకు నో ఛాన్స్.. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే!
Also Read
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
ఇక, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రంలోని దక్షిణాది జిల్లాల్లో ఇటీవల వరదలు సంభవించిన నేపథ్యంలో సహాయక చర్యల కోసం జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి 2,000 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని అభ్యర్థించారు. రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు జీవనోపాధి కల్పించేందుకు, తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి, తెన్కాసి జిల్లాల్లో తాత్కాలిక పునరావాస పనులు చేపట్టేందుకు ఆర్థిక సాయం చేస్తే.. కొంత ఉపశమనం దోరుకుతుందని ఆయన చెప్పారు.
Read Also: Harish Rao: ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వండి.. స్పీకర్ కు హరీష్ రావు లేఖ
అయితే, వరదల వల్ల సంభవించిన శాశ్వత నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయడానికి సమయం పడుతుంది అని సీఎం స్టాలిన్ చెప్పారు. జీవనోపాధిని అందించడానికి ఎన్డిఆర్ఎఫ్ చేస్తున్న ప్రయత్నాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రజా మౌలిక సదుపాయాలకు మరమ్మత్తుతో పాటు పునరుద్ధరణ పనులను అందించడానికి మేము కట్టుబడి ఉన్నామని ఆయన ప్రధానికి పేర్కొన్నారు. జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి రూ. 2,000 కోట్ల మధ్యంతర సహాయాన్ని అభ్యర్థిస్తున్నామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కోరారు.
తాజావార్తలు
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?