Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
- కార్యకర్తల పేరిట అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు
- మల్లయ్య కొండ, సాధు కొండల్లో మైనింగ్ జోలికి రావొద్దు
- ఈ నెల 12 వరకు ప్రతి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మల్లయ్య కొండ, సాధు కొండల్లో మైనింగ్ జోలికొస్తే.. చావడానికైనా, చంపడానికైనా సిద్ధమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాధ్ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రేపటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు ప్రతి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తంబళ్లపల్లి పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన మల్లయ్య కొండ, సాధు కొండలపై మైనింగ్ మాఫియా కన్ను పడిందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఆధ్యాత్మిక కేంద్రాలను మైనింగ్ పేరిట ధ్వంసం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. వాటి జోలికి వస్తే చావడానికైనా, చంపడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ప్రజలంతా కలిసికట్టుగా వచ్చి ఈ మైనింగ్ దోపిడీని అడ్డుకోవాలని.. కూటమి నాయకులు సహకరించకపోయినా ఈ ప్రజా ఉద్యమం ఆగే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాధ్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ కక్షతోనే తమపై బురదజల్లుతున్నారని, మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసు జరిగి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఎందుకు సీబీఐ విచారణ జరిపించలేకపోయారని కూటమి సర్కార్ను డిమాండ్ చేశారు. తాము తప్పు చేసినట్లు నిరూపించే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అని తంబళ్లపల్లె ఎమ్మెల్యే ప్రశ్నించారు.
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
ప్రస్తుత ప్రభుత్వంలో అధికారులను అడ్డం పెట్టుకుని, విలువైన 22A భూములను కూటమి కార్యకర్తల పేరిట అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాధ్ రెడ్డి ఆరోపించారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే ఈ భూదోపిడీ మొత్తం బయటకు తీసి, క్షేత్రస్థాయిలో కఠిన విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే సీఎం చంద్రబాబు కానీ, మంత్రి నారా లోకేష్ కానీ తంబళ్లపల్లి నియోజకవర్గంలో తనపై పోటీ చేసి గెలవాలని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?