PM Modi: PoK, ఉగ్రవాదుల అప్పగింతపై మాత్రమే చర్చలు.. భారత్ సందేశం..
- పీఓకే, ఉగ్రవాదుల అప్పగింతపై మాత్రమే చర్చలు..
- పాకిస్తాన్కి భారత్ బిగ్ మెసేజ్..
- ఇదే విషయాన్ని అమెరికాకు స్పష్టం చేసిన ప్రధాని మోడీ..
PM Modi:పాకిస్తాన్ చర్చల్లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) తిరిగి పొందడం, ఉగ్రవాదుల అప్పగించపై మాత్రమే ఉంటుందని భారత్ అమెరికాకు స్పష్టం చేసింది. “కాశ్మీర్ విషయంలో మాకు చాలా స్పష్టమైన వైఖరి ఉంది, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) తిరిగి రావడం అనే ఒకే ఒక విషయం మిగిలి ఉంది. ఇంకేమీ మాట్లాడటానికి లేదు. ఉగ్రవాదులను అప్పగించడం గురించి వారు మాట్లాడితే, మనం మాట్లాడుకోవచ్చు. మాకు వేరే ఏ అంశం ఉద్దేశం లేదు.భారత్ పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించాలని మేము కోరుకోవడం లేదు.’’ అనే విషయాన్ని ప్రధాని మోడీ, అమెరికాకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
Read Also: PM Modi: PoK, ఉగ్రవాదుల అప్పగింతపై మాత్రమే చర్చలు.. భారత్ సందేశం..
Also Read
- Tamilnadu Elections Exit Poll 2026: తమిళనాడులో స్టాలిన్ హవా.. చతికిలపడిన అన్నాడీఎంకే, టీవీకే..
- Kerala Election Exit poll 2026: కేరళలో హస్తం హవా.. పినరయికి గుడ్ బై..
- Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో "మామిడికాయ టమాటా రోటి పచ్చడి".!
- IPL 2026: అనూహ్య రీతిలో మెరిసిన భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణాలు.. బీసీసీఐ దృష్టిలో ఈ 5 గురు..
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యటాకులను పాక్ ప్రేరేపిత లష్కరేతోయిబా ఉగ్రవాదులు హతమార్చారు. దీనికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేపట్టింది. పీఓకే, పాకిస్తాన్ లోని జైషేమహ్మద్, లష్కరేతోయిబా ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఆ తర్వాత పాక్ డ్రోన్లతో, క్షిపణులతో భారత్పైకి దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా శనివారం తెల్లవారుజామున భారత్ పాకిస్తాన్లోని కీలక ఆర్మీ, వైమానిక స్థావరాలపై భారీ దాడులు చేసింది. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఈ నేపథ్యంలో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, ఈ చర్చల్లో యూఎస్ వైస్ ప్రెసిడెండ్ జేడీవాన్స్ కీలకంగా వ్యవహరించారు. ఆయన ప్రధాని మోడీతో ఒప్పందం గురించి మాట్లాడారు. అయితే, భారత్ తన నిర్ణయాన్ని జేడీ వాన్స్కి స్పష్టం చేసింది. మరోసారి పాకిస్తాన్ దాడికి తెగబడితే, చాలా దారుణమైన ప్రతిదాడిని ఎదుర్కోవాల్సి వస్తుందని మోడీ జేడీ వాన్స్కి తెలిపారు. గత 40 ఏళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాదానికి కారణమవుతోందని చెప్పారు.
తాజావార్తలు
-
Tamilnadu Elections Exit Poll 2026: తమిళనాడులో స్టాలిన్ హవా.. చతికిలపడిన అన్నాడీఎంకే, టీవీకే..
-
Peddi: ‘టాక్సిక్’ అవుట్.. లైన్లోకి రామ్ చరణ్ ‘పెద్ది’!
-
Kerala Election Exit poll 2026: కేరళలో హస్తం హవా.. పినరయికి గుడ్ బై..
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Anand Deverakonda: ఈ కథ చెప్పినప్పుడు.. నా కథ నాకే చెప్పాడా అనిపించింది!
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!