Kunamneni Sambasiva Rao : కేంద్ర బడ్జెట్ తెలంగాణ పట్ల వివక్ష
- కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం!
- విభజన హామీలు ఇంకా నెరవేరలేదని విమర్శ
- కార్పొరేట్ అనుకూల, పేద మధ్యతరగతి వ్యతిరేక బడ్జెట్ : కూనంనేని సాంబశివరావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kunamneni Sambasiva Rao : కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షత సష్టంగా కనిపించిందన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. దాదాపు సగం లోకసభ స్థానాలు బీజేపీ ఎంపిలు గెలిచినా రాష్ట్రానికి సాధించింది సున్నా అని ఆయన అన్నారు. విభజన హామీలను పదకొండేళ్ళువుతున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదని, కేవలం బీజేపీ ప్రభుత్వానికి అండగా ఉన్న బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకే ప్రత్యేకంగా నిధులు కేటాయించారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ ఎన్నికలను పెట్టుకొని ఉద్యోగులు, మధ్యతరగతి ఓటర్లు ఎక్కువ ఉన్నందునే ఆదాయ పన్ను పరిమితిని పెంచారని, ఇటీవల నిజామాబాద్ ప్రకటించిన జాతీయ పసుపు బోర్డు, అంతకు ముందు ఏడాది ప్రకటించిన గిరిజన యూనివర్సిటీకి సంబంధించి నిధుల కేటాయింపుపై స్పష్టత లేదన్నారు..
Pawan Kalyan: బడ్జెట్పై పవన్కల్యాణ్ ప్రశంసలు.. వికసిత్ భారత్కు తోడ్పడుతుందని వ్యాఖ్య
Also Read
- KTR: శాసనసభ కాదు.. అది దుశ్శాసన సభ: సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైర్
- CM Vijay: అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్ల సరసన విజయ్.. “1967, 1977, 1982, 2026” అంటూ కీలక వ్యాఖ్యలు
- LPG Booking: ఎల్పీజీ వినియోగదారులకు భారీ ఊరట.. బుకింగ్ సమయంపై కేంద్రం కీలక ప్రకటన
- Trump Hair: హెయిర్స్టైల్ మార్చేసిన ట్రంప్.. నెటిజన్లు కామెంట్లు
అంతేకాకుండా..’ రాష్ట్రంలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. గత నెలలో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ సుమారు రూ.3లక్షల కోట్లకు సంబంధించిన పథకాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను ప్రధాని,ఇతర కేంద్ర మంత్రులు చేశారు. అందుకు సంతోషమే. కానీ, తెలంగాణ రాష్ట్రానికి మాత్రం కేంద్రం మొండిచేయి చూపింది. మొత్తమ్మీద కేంద్ర బడ్జెట్ ప్రైవేటీకరణకు మరింత బాటలు వేసింది. ఆస్తుల నగదీకరణ పథకం కింద పదేళ్ళలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి రూ.10 లక్షల కోట్లు సేకరించడం, బీమా రంగంలో విదేశీప్రత్యక్ష పెట్టుబడులను 75 నుంచి 100 శాతానికి పెంచారు. అప్పులు 182 లక్షల కోట్లకు చేరాయి. రక్షణ రంగానికి అత్యధికంగా రూ.4.91 లక్షల కోట్లు కేటాయించగా, గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు, వ్యవసాయానికి రూ.1.71 కోట్లు కలిపినా, రక్షణ రంగానికి చేరువలో లేవు. గ్రామీణ ఉపాధి మామీ పథకానికి రెండేళ్ళ క్రితం రూ.89,154 కోట్లు కేటాయించగా, ఈ సారి బడ్జెట్ రూ.86వేల కోట్లే కేటాయించారు. కార్పొరేటర్ పన్నులకు సంబంధించి బడ్జెట్ స్పష్టత ఇవ్వలేదు. ఇది కార్పొరేట్ అనుకూల, పేద, మధ్య తరగతి వ్యతిరేక బడ్జెట్.’ అని కూనంనేని సాంబశివరావు అన్నారు.
తాజావార్తలు
-
KTR: శాసనసభ కాదు.. అది దుశ్శాసన సభ: సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైర్
-
CM Vijay: అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్ల సరసన విజయ్.. “1967, 1977, 1982, 2026” అంటూ కీలక వ్యాఖ్యలు
-
Varanasi: ‘వారణాసి’ ఊచకోత.. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.320 కోట్ల బిజినెస్సా?
-
LPG Booking: ఎల్పీజీ వినియోగదారులకు భారీ ఊరట.. బుకింగ్ సమయంపై కేంద్రం కీలక ప్రకటన
-
ChatGPT వాడుతున్నారా? ఇకపై మీకు ఒక కొత్త తలనొప్పి రాబోతుంది!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!