Pakistan Team: పరువంతా పోయిందిగా.. ఈ ఒక్క సంఘటన చాలు! పాకిస్థాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Team: భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 మధ్యలో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి అనేక చర్చలకు దారి తీస్తుంది. కొలంబోలో చిత్రీకరించబడినట్లుగా ఉన్న వీడియోలో పాకిస్థాన్ ఆటగాళ్లు జట్టు బస్సు నుంచి దిగిన తర్వాత ధూళితో ఉన్న రోడ్లు, శిథిలావస్థలో ఉన్న భవనాల మధ్య నడుచుకుంటూ వెళ్లడం కనిపిస్తుంది.
Also Read
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
- KTR: 'రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి'..
- SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
ఆ వీడియోలో కెప్టెన్ సల్మాన్ అలీ అఘా, బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది, సయీమ్ అయూబ్ వంటి ఆటగాళ్లు కనిపించడంతో ఈ వీడియో మరింత వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్ల నుండి భారీ స్పందన వచ్చింది. అంతర్జాతీయ టోర్నమెంట్కు వచ్చిన జట్టుకు సరైన వసతులు కల్పించలేదా అని ప్రశ్నింస్తుంటే.. మరికొందరు ఆ ప్రదేశాన్ని “సిమెంట్ ఫ్యాక్టరీలా కనిపిస్తోంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు భారత్ తో పెట్టుకుంటే ఇట్టే ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే ఈ వీడియో నిజంగా జట్టు వసతి గృహానికి సంబంధించినదా.. లేక ట్రైనింగ్ ప్రాంతమా లేదా స్టేడియం వెనుక భాగమా అన్నది ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు. ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB), ఐసీసీ లేదా శ్రీలంక క్రికెట్ అధికారులు ఇప్పటివరకు స్పందించలేదు. ఈ వీడియో వైరల్ కావడం కూడా ప్రస్తుతం జరుగుతున్న భారత్-పాక్ మ్యాచ్ వివాదం నేపథ్యంలో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కొలంబోలో జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ను బహిష్కరించాలని పాకిస్థాన్ ప్రభుత్వం మొదట నిర్ణయించింది. దీనిపై ఐసీసీ, పీసీబీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య చర్చలు జరిగాయి.
లాహోర్ లోని గడ్డాఫీ స్టేడియంలో జరిగిన క్లోజ్డ్ డోర్ సమావేశం దాదాపు నాలుగు గంటలు కొనసాగింది. సభ్యుల ఒప్పందం ప్రకారం ‘ఫోర్స్ మజ్యూర్’ పరిస్థితిని పీసీబీ ఎలా సమర్థించగలదో ఐసీసీ వివరాలు కోరినట్లు సమాచారం. మ్యాచ్ జరగకపోతే ఐసీసీకి భారీ నష్టం కలగవచ్చని కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. చివరికి పాకిస్థాన్ ప్రభుత్వం తన బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో.. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం యధావిధిగా జరుగనుంది.
This is the “hospitality” Pakistan cricket team got in Colombo from Sri Lanka and the ICC.
Looks less like a team hotel and more like workers clocking out of a cement factory. 😂 pic.twitter.com/MpyFVmtJho
— Wahida 🇦🇫 (@RealWahidaAFG) February 9, 2026
తాజావార్తలు
-
FIFA ఫైనల్లో ట్రంప్కు ఊహించని అవమానం.. అసలేం జరిగిందంటే?
-
Lenin : అఖిల్ బాక్సాఫీస్ ఊచకోత.. 10 రోజుల్లో ‘లెనిన్’ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
-
Yash: రాకింగ్ స్టార్ యష్తో ప్రశాంత్ వర్మ సినిమా? మామూలుగా ఉండదట!
-
Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
-
Silk Smitha: నాకు ఒకడు జీవితం ఇస్తానన్నాడు.. రోజూ టార్చర్ నేను భరించలేను.. సిల్క్ స్మిత సూసైడ్ నోట్ చూశారా?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!