T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ అంపైర్లు, రిఫరీలు లిస్ట్ వచ్చేసిందోచ్.. లిస్ట్ లో ఇండియన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 టీ20 ప్రపంచకప్ కోసం 26 మంది మ్యాచ్ అధికారులను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. జూన్ 2 నుంచి 29 వరకు వెస్టిండీస్, అమెరికాలలో జరగనున్న ఈ మెగా టోర్నీకి 20 మంది అంపైర్లు, ఆరుగురు రిఫరీలను ఐసీసీ నియమించింది. వీరిలో ముగ్గురు భారత అధికారులు చోటు దక్కించుకున్నారు.
వచ్చే నెలలో తొమ్మిదో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇందుకోసం అన్ని జట్లు ఇప్పటికే తమ ఆటగాళ్ల జాబితాలను ప్రకటించాయి. దాంతో ఇప్పుడు మ్యాచ్ అధికారుల జాబితాను కూడా ఐసీసీ ప్రకటించింది. టోర్నమెంట్ కోసం 26 మంది అధికారులు నియమించబడ్డారు, ఇందులో 20 జట్లు 28 రోజుల పాటు 55 మ్యాచ్ లు జరగనున్నాయి. వీరిలో 20 మంది రిఫరీలు కాగా, ఆరుగురు రిఫరీలు. వీరిలో ముగ్గురు భారత్కు చెందిన వారు. నితిన్ మీనన్, జయరామన్ మదనగోపాల్ అంపైర్లుగా ఎంపికయ్యారు. జవగల్ శ్రీనాథ్ ఒక్కరు ప్రపంచకప్ కు రిఫరీగా వెళ్లనున్నాడు. ఈ మెగా టోర్నీకి ఎంతో మంది అనుభవజ్ఞులైన న్యాయ నిర్ణేతలు ఎంపికయ్యారు. వీరిలో రిచర్డ్ ఇల్లింగ్ వర్త్, కుమార ధర్మసేన, క్రిస్ గఫానీ, పాల్ రైఫిల్ ఉన్నారు.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
భారత్కు చెందిన జయరామన్ మదనగోపాల్ ఈ ప్రపంచకప్లో తొలిసారిగా సీనియర్ క్రికెట్ మ్యాచ్ లకు అంపైర్గా వ్యవహరించనున్నారు. ఇక మ్యాచ్ రిఫరీల విషయానికొస్తే.., జియోఫ్ క్రోవ్, ఆండ్రూ పైక్రాఫ్ట్, రంజన్ మదుగలె లతోపాటు శ్రీనాథ్ ఉన్నారు. ఇక ఎంపికైన అంపైర్ల విషయానికి వస్తే.. క్రిస్ బ్రౌన్, ధర్మసేన, క్రిస్ గఫనీ, మైఖేల్ గాఫ్, హోల్డ్స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్వర్త్, అల్లాహుద్దీన్ పాలేకర్, రిచర్డ్ కెటిల్బరో, జయరామన్ మదనగోపాల్, నితిన్ మేనన్, సామ్ నోగాస్కి, ఎహసాన్ రజా, రషీద్ రియాజ్, పాల్ రైఫిల్, లాంగ్టన్ రుసెరె, షాహిత్ సైకాత్, రాడ్నీ టక్కర్, అలెక్స్ వార్ఫ్, జోయెల్ విల్సన్, ఆసిఫ్ యాకూబ్ లు ఎన్నికయ్యారు. అలాగే మ్యాచ్ రిఫరీలలో డేవిడ్ బూన్, జెఫ్ క్రో, రంజన్ మదుగలె, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్సన్, జవగళ్ శ్రీనాథ్ లు ఉన్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!