T. Rajaiah: కడియం శ్రీహరి, కావ్యపై తాటికొండ రాజయ్య ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ ఎన్నికల వేళ వరంగల్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి, అతడి కుమార్తె వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కావ్యపై తీవ్ర విమర్శలు చేశారు. కడియం కావ్య.. ఓ ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్నప్పుడు ముస్లిం సంప్రదాయాలను పాటించాలని రాజయ్య అన్నారు. ఈ మతంతోని ఆమె రిజర్వేషన్ పోతుందనే భయంతో వాల్ల పిల్లల పేర్లలో కడియం అని తోక తగిలించున్నారని విమర్శించారు. ముస్లింల సంప్రదాయం ప్రకారం తమ మతాన్ని స్వీకరించిన తరువాతనే పెళ్లి చేస్తారు.. మరి ముస్లిం మతం స్వీకరించిన కావ్యకు ఎస్సీ కులం ఎట్లా వచ్చిందని ప్రశ్నించారు.
READ MORE: Kubera: ధనుష్ ‘కుబేర’లో నాగార్జున పాత్ర ఇదే.. క్లారిటీ వచ్చేసిందిగా..
Also Read
- Asim Munir: పాక్ సైన్యంపై అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ.. దేనికోసమో..!
- India vs Sri Lanka 2nd Test: భారత్తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
- Rahul Gandhi: పెల్లెట్ గన్ రగడ.. రాహుల్, ప్రియాంకా గాంధీల మెరుపు ధర్నా..
- Gadikota Srikanth Reddy: అన్ని ప్రాంతాల్లో కరువు జాడ..! ముందుచూపుతో వ్యవహరించండి-గడికోట శ్రీకాంత్ రెడ్డి
నీ అయ్యకు పుట్టినంత మాత్రాన నువ్వు బైండ్లదానివి అవుతావా.? మీ అయ్యనే ఎవరికి పుట్టిండో తెలవదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి 60 ఏండ్లుగా దళితుల రిజర్వేషన్ ను అప్పనంగా వాడుకుంటూ మాదిగలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో అన్ని పదవులను అనుభవించి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లో చేరారని మండిపడ్డారు. దేశమంతా ఈ చీడ పురుగు కడియం శ్రీహరి వెన్నుపోటు గురించే మాట్లాడుకుంటున్నారన్నారు. కడియం శ్రీహరిది ఒక బ్లాక్ మెయిల్ రాజకీయమని ఆరోపించారు. అలాంటి బ్లాక్ మెయిలర్ కూతురిని పార్లమెంటు ఎన్నికల్లో ఓడగొట్టాలనే కసితో వరంగల్ ప్రజలు ఉన్నారన్నారు. వరంగల్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో లింగాలఘనపురం మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ బాబు హాజరై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
తాజావార్తలు
-
Asim Munir: పాక్ సైన్యంపై అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ.. దేనికోసమో..!
-
India vs Sri Lanka 2nd Test: భారత్తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
-
Rahul Gandhi: పెల్లెట్ గన్ రగడ.. రాహుల్, ప్రియాంకా గాంధీల మెరుపు ధర్నా..
-
Zodiac Signs : బుధ నక్షత్ర మార్పు.. ఆ 4 రాశుల వారికి సవాళ్లు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
Gadikota Srikanth Reddy: అన్ని ప్రాంతాల్లో కరువు జాడ..! ముందుచూపుతో వ్యవహరించండి-గడికోట శ్రీకాంత్ రెడ్డి
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!