వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) క్యాంపస్లో స్వైన్ ఫ్లూ కేసు ఒకటి వెలుగులోకి రావడం కలకలం రేపుంతోంది. జ్వరంతో బాధపడుతున్న విద్యార్థిని హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా శుక్రవారం రాత్రి హెచ్1ఎన్1 సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రి యాజమాన్యం జిల్లా వైద్య , ఆరోగ్య అధికారులను అప్రమత్తం చేసింది. వారు ప్రాంగణంలో శానిటైజేషన్ కోసం ఎన్ఐటీ యాజమాన్యం, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) కు సమాచారం అందించారు. ఇంతలో ఎన్ఐటీ ఆరోగ్య కేంద్రం వైద్యులు సోకిన విద్యార్థితో పాటు క్యాంపస్లోని ఇతర విద్యార్థుల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని, సన్నిహిత మెదిలినవారు కనీసం ఒక వారం పాటు ఒంటరిగా ఉండాలని కోరారు.
హెచ్1ఎన్1 పాజిటివ్గా తేలిన విద్యార్థి హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హాస్టల్ ఆవరణలో, తరగతి గదులలో శానిటైజేషన్ జరిగింది” అని ఎన్ఐటీ అధికారులు నుండి ఆదివారం ఒక ప్రెస్ నోట్ విడుదలైంది. ఇన్స్టిట్యూట్ హెల్త్ సెంటర్ సిబ్బంది స్వైన్ ఫ్లూ సోకిన విద్యార్థికి సన్నిహితంగా ఉన్న విద్యార్థులను సంప్రదించి, ఐసోలేషన్లో ఉండాలని, ఏవైనా లక్షణాలు ఉంటే ఆరోగ్య కేంద్రానికి సంప్రదించాలని సూచించారు. హాస్టల్ అడ్మినిస్ట్రేషన్తో పాటు ఇన్స్టిట్యూట్ హెల్త్ సెంటర్ అధికారులు ఫ్లూ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు.