TTD: ముగుస్తున్న టీటీడీ పాలక మండలి గడువు.. ఆ రెండు ఆప్షన్లపై ఉత్కంఠ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణకు పాలకమండలిని నియమిస్తుంది ప్రభుత్వం. గతంలో 18 మందితో కూడిన పాలకమండలి నియామకం జరగగా.. ప్రస్తుత పాలకమండలి సభ్యుల సంఖ్య 35కి చేరుకుంది. వీరికి తోడు పలు రాష్ర్టాలకు సంబంధించిన టీటీడీ లోకల్ బాడీ చైర్మన్లు కూడా పాలకమండలి సభ్యుల తరహాలో వ్యవహరిస్తున్నారు. మరోవైపు గతంలో తెలుగు రాష్ర్టాలతో పాటు తమిళనాడు, కర్నాటక నుంచి ఒక్కొక్కరికి పాలకమండలిలో చోటు దక్కుతుండగా.. ఇప్పుడు తెలుగు రాష్ర్టాల వారికంటే.. ఇతర రాష్ర్టాల సభ్యులే ఎక్కువగా వుంటున్నారు. ఇలా కాలక్రమేణా మారుతూ వస్తున్న ప్రస్తుత టీటీడీ పాలకమండలి గడువు ఆగస్టు 12తో ముగియనుంది.
టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని రెండోసారి 2021 ఆగస్ట్ 12న నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చెయ్యగా.. సభ్యులను సెప్టెంబర్ చివర్లో నియమించింది. అయినప్పటికీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే పాలకమండలి గడువు అమలులోకి వస్తుంది. అలా ప్రస్తుత పాలకమండలి గడువు ఆగస్టు 12వ తేదీతో ముగియనుండటం.. ఇప్పటికే రాజకీయంగా బిజీ షెడ్యూల్ తో వుంటున్న చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మరోసారి కొనసాగనని స్పష్టత ఇచ్చారు. దీంతో ప్రభుత్వం ముందు రెండు ఆప్షన్లు వున్నాయి. ఒకటి నూతనంగా పాలకమండలిని ఏర్పాటు చెయ్యడం.. లేదా ఎన్నికల సంవత్సరం కాబట్టి.. తాత్కాలికంగా స్పెసిఫైడ్ అథారిటీని నియమించడం.. ఈ రెండు ఆప్షన్లను పరిశీలిస్తోంది ప్రభుత్వం.
Also Read
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
టీటీడీ పాలకమండలిలో చోటు కోసం ప్రయత్నించని వారంటు లేరు. ఒక్కప్పుడు రాష్ర్టం వరకే పరిమితమైన టీటీడీ పాలకమండలిలో సభ్యత్వం కోసం సిఫార్సుల తంతు.. ఇప్పుడు దేశమంతా పాకింది. పాలకమండలిలో సభ్యత్వం కోసం కేంద్రంలో కీలకమైన నాయకులే కాకూండా కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిఫార్సు చేసే పరిస్థితి ఏర్పడింది. దీంతో పాలకమండలి నియమాకం రాష్ర్ట ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి. ఇది ఏ స్థాయికి చేరుకుందంటే…రాజకీయ ఒత్తిళ్ళకు తట్టుకోలేక గత పాలకమండలి నియమాక సమయంలో ఎన్నడూ లేని విధంగా 85 మందితో జంబో జెట్ పాలకమండలని నియమించింది రాష్ర్ట ప్రభుత్వం. ఆర్డినెన్స్ తీసుకువచ్చి35 మంది సభ్యులుతో పాటు మరో 50 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది ప్రభుత్వం. కాని జెంబో జెట్ పాలకమండలి నియమాకంపై బీజేపీ నాయకులు కోర్టుకి ఎక్కడంతో.. ప్రత్యేక ఆహ్వనితుల నియమాకంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారి చేసింది హైకోర్టు. అప్పటి నుంచి ఈ అంశం కోర్టు పరిధిలోనే వుంది. దీంతో ప్రస్తుత పాలకమండలి గడువు ముగిసిన తరువాత నూతన పాలకమండలి నియామక సమయంలో 35 మంది సభ్యులకే రాష్ర్ట ప్రభుత్వం పరిమితం కావలసి వుంటుంది.
ఎన్నికల సీజన్ కావడంతో టీటీడీ పాలకమండలిలో సభ్యత్వం ఆశించే వారి సంఖ్య ఎక్కువగానే వుంటుంది. మరోవైపు గతంలో లాగా ఇతర రాష్ర్టాల వారికి పాలకమండలి పెద్ద పీట వేస్తే.. స్వపక్షంలో అసంతృప్తి జ్వాలలు మరింత పెరిగే అవకాశం వుంది. ఈసారి ప్రభుత్వం అలాంటి ప్రయత్నం చెయ్యకపోవచ్చు. మరి ఎన్నికల ఏడాదిలో ఇంతటి ఒత్తిళ్లకు ప్రభుత్వం తట్టుకుటుందా.. లేక ఇవన్నీ ఎందుకులే అని స్పెసిఫైడ్ అథారిటిని నియమించి చేతులు దులుపేసుకుంటుందా అన్నది చూడాలి.
తాజావార్తలు
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!