Suryakumar Yadav: కోహ్లీ రికార్డుకు చెక్.. సూర్య భాయ్ నయా హిస్టరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav: ముంబై వానఖేడే స్టేడియంలో జరిగిన ఈ భారత్-అమెరికా మ్యాచ్ ప్రతి ఒక్క అభిమాని గుండెల్లో నిలిచిపోతుంది. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు తమ తొలి గ్రూప్ మ్యాచ్లో అమెరికాను 29 పరుగుల తేడాతో ఓడించింది. స్కోర్బోర్డ్ చూసినప్పుడు ఇది సాధారణ గెలుపులా అనిపించొచ్చు. కానీ మ్యాచ్ అంత ఈజీగా సాగలేదు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భుజాలపై వేసుకుని గెలిపించాడు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు మొదట్లోనే ఇబ్బందుల్లో పడింది. వరుసగా వికెట్లు పడటంతో స్కోరు నెమ్మదిగా సాగింది. ఒక దశలో పెద్ద స్కోరు అసాధ్యమే అనిపించింది. అప్పుడు క్రీజ్లో నిలబడ్డాడు కెప్టెన్ సూర్యకుమార్. మొదట జాగ్రత్తగా ఆడుతూ, తర్వాత తన స్టైల్లో షాట్లు కొట్టడం మొదలుపెట్టాడు. నాలుగో వైపు బాల్ వెళ్తే బౌలర్లు అయోమయంలో పడిపోయారు. అతని బ్యాట్ నుంచి 10 ఫోర్లు, 4 సిక్సర్లు వచ్చాయి. 49 బంతుల్లోనే నాటౌట్గా 84 పరుగులు చేశాడు. చివరకు భారత్ 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. అమెరికా ముందు 162 పరుగుల లక్ష్యం నిలిచింది.
READ MORE: Suryakumar Yadav: శభాష్ సూర్యకుమార్! కెప్టెన్గా తొలి ప్రపంచకప్ ఇన్నింగ్స్లోనే అరుదైన ఘనత..
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
లక్ష్యం పెద్దదిగా అనిపించకపోయినా, భారత బౌలర్లు మ్యాచ్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. బౌలర్ అర్షదీప్ సింగ్ మరోసారి మెరిశాడు. అతను రెండు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి ఆశలను తగ్గించాడు. ఈ మ్యాచ్తో టీ20 వరల్డ్ కప్లో అర్షదీప్ వికెట్ల సంఖ్య 29కి చేరింది. ఎట్టకేలకు అమెరికా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపు వెనుక అసలు హీరో సూర్యకుమార్ యాదవ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ అవార్డుతో సూర్యకుమార్ మరో రికార్డు తన పేరుపై రాసుకున్నాడు. టీ20 ఇంటర్నేషనల్ల్లో భారత్ తరఫున అత్యధికంగా 17 సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెలిచిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరు మీద ఉండేది. కోహ్లీ 16 సార్లు ఈ అవార్డు గెలిచాడు. సూర్య ఇప్పుడు కోహ్లీని వెనక్కి నెట్టేశాడు. రోహిత్ శర్మ 14 సార్లు, అక్షర్ పటేల్ 8 సార్లు ఈ అవార్డు గెలిచారు.
READ MORE: Instant Ragi Uttapam: కాల్షియం ఫుల్.. రుచి డబుల్.. పది నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రాగి ఉత్తప్పం
వరల్డ్ కప్ విషయానికి వస్తే సూర్యకుమార్ మరో ప్రత్యేక ఘనత సాధించాడు. టీ20 వరల్డ్ కప్లో అతను నాలుగుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెలిచాడు. ఈ లిస్టులో విరాట్ కోహ్లీ ఇంకా ముందున్నాడు. కోహ్లీ 35 మ్యాచ్లు ఆడి 8 సార్లు ఈ అవార్డు అందుకున్నాడు. సూర్య 19 మ్యాచ్ల్లో 4 సార్లు గెలిచాడు. యువరాజ్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ ముగ్గురూ వరల్డ్ కప్లో 3 సార్లు చొప్పున ఈ అవార్డు పొందారు. ఇప్పుడు సూర్య వాళ్లందరినీ దాటేశాడు. ఈ గెలుపుతో భారత జట్టు మరో గొప్ప రికార్డు కూడా సృష్టించింది. టీ20 వరల్డ్ కప్లో వరుసగా 9 మ్యాచ్లు గెలిచిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు వరుసగా 8 మ్యాచ్లు గెలిచి టాప్లో ఉండేవి. భారత్ ఇప్పుడు వాళ్లను కూడా దాటిపోయింది. గతంలో భారత్ 2012 నుంచి 2014 మధ్య 7 వరుస విజయాలు మాత్రమే సాధించింది.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!