సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. సిద్ధార్థ రెడ్డి పిటిషన్ ను సుప్రీంకోర్ట్ డిస్మిస్ చేసింది. నాలుగు వారాల్లో సిద్ధార్థ రెడ్డిని లొంగిపోవాలని సుప్రీ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. పోస్టుమార్టం రిపోర్టు, మునిస్వామి ఇచ్చిన ఫోరెన్సిక్ నివేదిక, ప్రత్యూషను ఆత్మహత్యకు పురిగొలిపినట్లుగా లభించిన ఆధారాలు, హెల్త్ రిపోర్ట్స్ సహా ఏడు ఆధారాలను పరిశీలించి సిద్ధార్థ రెడ్డి పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్ట్ సమర్థించింది.
Also Read:Gold-Silver Rates: గోల్డ్ లవర్స్కు పండగే.. పండగ.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు
రెండు దశాబ్దాల క్రితం సినీనటి ప్రత్యూష మృతి సంచలనం సృష్టించింది. 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం కూల్ డ్రింక్ లో పురుగుల మందు తాగిన ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డిలు.. 24న ప్రత్యూష మృతి చెందింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాలు చేస్తూ శిక్ష పెంచాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ప్రత్యూష తల్లి సరోజినీ దేవి.. కేసు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. గత ఏడాది నవంబర్లో తీర్పు రిజర్వ్ చేసింది.. నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష ఐదువేల జరిమానా విధించారు.
Also Read:Haryana: 5 నెలల క్రితమే బ్యాంక్ ఉద్యోగినితో పెళ్లి.. వాలెంటైన్ డే రోజున భర్త ఏం చేశాడంటే..!
సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షలు రెండేళ్లకు తగ్గిస్తూ తీర్పునిచ్చింది హైకోర్టు. 2012లో సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసిన ప్రత్యూష తల్లి సరోజినీ దేవి. ప్రత్యూషను ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొలిపినందున సెక్షన్ 302 కింద శిక్ష విధించాలని లేదంటే సెక్షన్ 306 కింద గరిష్ట శిక్ష విధించాలని సుప్రీంకోర్టులో ప్రత్యూష తరఫున వాదనలు వినిపించారు. ఇద్దరూ కలిసి పురుగుల మందు తీసుకున్నందువల్ల ఆత్మహత్యకు ఉసిగొల్పాడు అన్న అంశం ఉత్పన్నం కాదని నిందితుడి తరఫున వాదనలు వినిపించారు. సుదీర్ఘ విచారణల అనంతరం సుప్రీం కోర్టు తుది తీర్పు వెల్లడించింది.