NEET UG 2024: నీట్ కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విచారణ వాయిదా
- సుప్రీంకోర్టులో నీట్ కేసుపై విచారణ
- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలో విచారణ
- సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
- ఈ పరీక్షలో పేపర్ లీకైన మాట వాస్తవమే- సుప్రీం
- ఈ కేసు విచారణ గురువారానికి వాయిదా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ – అండర్ గ్రాడ్యుయేట్ (NEET UG) 2024ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని తిరిగి నిర్వహించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన 38 పిటిషన్లపై ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం చేపట్టింది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Beerla Ilaiah: మంత్రి పదవి ఆశిస్తున్నా.. సీఎం సానుకూలంగా స్పందించారు..
Also Read
- Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
- India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
ఈ పరీక్షలో పేపర్ లీకైన మాట వాస్తవమేనని కోర్టు తెలిపింది. కానీ, అది 23 లక్షల మందితో ముడిపడిన అంశం’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. పరీక్షను తిరిగి నిర్వహించాలన్నది లాస్ట్ ఆప్షన్ మాత్రమే అని ఈ సందర్భంగా సీజేఐ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఎన్ని ఫలితాలను హోల్డ్లో పెట్టారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. విచారణలో భాగంగా.. జూలై 10వ తేదీ బుధవారంలోగా డివిజనల్ బెంచ్ ముందు వివరణాత్మక నివేదిక సమర్పించాలని ఎస్జీ తుషార్ మెహతాను కోరారు. మొత్తం ప్రక్రియ ఎలా సాగింది, ఎఫ్ఐఆర్ తీరు, పేపర్ ఎలా లీక్ అయింది, కేంద్రం, ఎన్టీఏ ఎలాంటి చర్యలు తీసుకున్నాయో చూడాలని ధర్మాసనం పేర్కొంది. అందుకే.. దీనిపై జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పు ఇస్తామని ధర్మాసనం వెల్లడించింది.
Stock market: ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్
చాలా మంది విద్యార్థులకు 720/720 మార్కులు వచ్చాయని.. స్కోర్ సరళిలోని లోపాలు తదితరాలను పరిశీలించాల్సి ఉందని డివిజన్ బెంచ్ ఎన్టీఏకు తెలిపింది. ప్రశ్నాపత్రాలను ముద్రించడం నుంచి విద్యార్థులకు ఇచ్చే వరకు ఏదైనా లోపం ఉంటే అది వ్యవస్థ వైఫల్యమేనని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రశ్నపత్రం తయారీ నుంచి పరీక్షా కేంద్రంలో పంపిణీ వరకు పూర్తి సమాచారాన్ని ఎన్టీఏ నుంచి డివిజన్ బెంచ్ కోరింది. కాగా.. ఈ కేసులో గత నెల జూన్ 18న విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా.. ప్రభుత్వ సంస్థ ఎన్టీఏ తన పక్షాన్ని సమర్పించాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే, కేసుల తదుపరి విచారణను జూలై 8న జరపాలని డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకుంది. అయితే.. జూన్ 18 న విచారణ తర్వాత సుప్రీంకోర్టులో మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో.. విచారణ ఈరోజు చేపట్టారు. కాగా.. ఈ కేసుపై విచారించిన ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది.
- Tags
తాజావార్తలు
-
Kamal Haasan: స్టార్ హీరోల కళ్ళు తెరిపించిన కమల్ హాసన్.. నెట్టింట ప్రశంసల వెల్లువ!
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
-
Jananayagan : కళ్లు చెదిరే రేటుకు ‘జననాయగన్’ తెలుగు రైట్స్?
-
Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!