NEET UG 2024: నీట్ కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విచారణ వాయిదా
- సుప్రీంకోర్టులో నీట్ కేసుపై విచారణ
- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలో విచారణ
- సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
- ఈ పరీక్షలో పేపర్ లీకైన మాట వాస్తవమే- సుప్రీం
- ఈ కేసు విచారణ గురువారానికి వాయిదా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ – అండర్ గ్రాడ్యుయేట్ (NEET UG) 2024ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని తిరిగి నిర్వహించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన 38 పిటిషన్లపై ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం చేపట్టింది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Beerla Ilaiah: మంత్రి పదవి ఆశిస్తున్నా.. సీఎం సానుకూలంగా స్పందించారు..
Also Read
- Lokesh Kanagaraj DC Movie Review : లోకేష్ కనగరాజ్ 'డీసీ' రివ్యూ..
- Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
- Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
ఈ పరీక్షలో పేపర్ లీకైన మాట వాస్తవమేనని కోర్టు తెలిపింది. కానీ, అది 23 లక్షల మందితో ముడిపడిన అంశం’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. పరీక్షను తిరిగి నిర్వహించాలన్నది లాస్ట్ ఆప్షన్ మాత్రమే అని ఈ సందర్భంగా సీజేఐ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో ఎన్ని ఫలితాలను హోల్డ్లో పెట్టారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. విచారణలో భాగంగా.. జూలై 10వ తేదీ బుధవారంలోగా డివిజనల్ బెంచ్ ముందు వివరణాత్మక నివేదిక సమర్పించాలని ఎస్జీ తుషార్ మెహతాను కోరారు. మొత్తం ప్రక్రియ ఎలా సాగింది, ఎఫ్ఐఆర్ తీరు, పేపర్ ఎలా లీక్ అయింది, కేంద్రం, ఎన్టీఏ ఎలాంటి చర్యలు తీసుకున్నాయో చూడాలని ధర్మాసనం పేర్కొంది. అందుకే.. దీనిపై జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పు ఇస్తామని ధర్మాసనం వెల్లడించింది.
Stock market: ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్
చాలా మంది విద్యార్థులకు 720/720 మార్కులు వచ్చాయని.. స్కోర్ సరళిలోని లోపాలు తదితరాలను పరిశీలించాల్సి ఉందని డివిజన్ బెంచ్ ఎన్టీఏకు తెలిపింది. ప్రశ్నాపత్రాలను ముద్రించడం నుంచి విద్యార్థులకు ఇచ్చే వరకు ఏదైనా లోపం ఉంటే అది వ్యవస్థ వైఫల్యమేనని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రశ్నపత్రం తయారీ నుంచి పరీక్షా కేంద్రంలో పంపిణీ వరకు పూర్తి సమాచారాన్ని ఎన్టీఏ నుంచి డివిజన్ బెంచ్ కోరింది. కాగా.. ఈ కేసులో గత నెల జూన్ 18న విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా.. ప్రభుత్వ సంస్థ ఎన్టీఏ తన పక్షాన్ని సమర్పించాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే, కేసుల తదుపరి విచారణను జూలై 8న జరపాలని డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకుంది. అయితే.. జూన్ 18 న విచారణ తర్వాత సుప్రీంకోర్టులో మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో.. విచారణ ఈరోజు చేపట్టారు. కాగా.. ఈ కేసుపై విచారించిన ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది.
- Tags
తాజావార్తలు
-
Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
Thailand School Shooting: స్కూల్లో కాల్పులు.. ఉపాధ్యాయుడు మృతి, 20 మంది విద్యార్థులకు గాయాలు..
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!