Delhi Water Crisis: ట్యాంకర్ మాఫియా నీటిని దోచుకుపోతుంటే ఏం చేస్తున్నారు..?
- ఢిల్లీలో కొనసాగుతున్న నీటి సంక్షోభం..
- ప్రజలు నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడిన పరిస్థితి..
- ట్యాంకర్ మాఫియా కట్టడికి ఏం చర్యలు తీసుకున్నారు: సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో నీటి సంక్షోభం కొనసాగుతుంది. ప్రజలు నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడిన పరిస్థితి ఏర్పాడింది. ఈ ట్యాంకర్ మాఫియా కట్టడికి, నీటి వృథాను అరికట్టడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి మిగులు జలాలు విడుదల కోరుతూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ చేసిన అభ్యర్థన నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ విధంగా రియాక్ట్ అయింది.
Read Also: TG TET 2024 Results: టీజీ టెట్ ఫలితాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
Also Read
- ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
- Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్పై విడుదల
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
ఇక, ట్యాంకర్ మాఫియా ఆ నీటినంతా మింగేసింది అని సుప్రీంకోర్టు తెలిపింది. నీరు వృథాగా పోతుంది.. దానిపై మీరు ఎలాంటి చర్యలు చేపట్టారని అడిగింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి వస్తోన్న నీరు ఎక్కడికిపోతుంది? ప్రజలు బాధపడుతున్నారు.. వార్తల్లో ఆ దృశ్యాలను మేం చూస్తున్నాం.. వేసవిలో నీటి ఎద్దడి పదేపదే ఎదురవుతుంటే.. వృథా నీటిని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని న్యాయస్థానం ప్రశ్నించింది. కోర్టు ముందు ఎందుకు అసత్య ప్రకటనలు చేస్తున్నారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోలేకపోతే.. ఆ పని పోలీసులకు అప్పగిస్తామని దేశ అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది.
Read Also: Sudheer Babu: తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి కథతో సినిమా రాలేదు.. హిట్ కొట్టేస్తాం!
కాగా, దీనిపై ఢిల్లీ ప్రభుత్వ తరఫు లాయర్ కోర్టులో తన వాదనలు వినిపించారు. నీటి వృథా కట్టడికి తీసుకుంటున్న చర్యలను తెలిపారు.. వాటిపై ఒక అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. ఆ దిశగా వెంటనే రిపోర్టును సమర్పించాలని ఆదేశాలు. తప్పుడు ప్రకటనలు చేస్తున్నారంటూ ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సర్కార్ ను మందలించిన కోర్టు.. అలాగే, విచారణను గురువారానికి వాయిదా వేసింది.
Delhi water crisis | Supreme Court questions over tanker mafia and asks Delhi Govt if any measure or action has been taken against tanker mafia.
Supreme Court remarks if you are not taking any action against the tanker mafia then we will ask Delhi Police to take action against… pic.twitter.com/ORFwr44Wuo
— ANI (@ANI) June 12, 2024
తాజావార్తలు
-
CSK Head Coach: ఎంఎస్ ధోనీ వద్దు.. సీఎస్కేకు ఆ టీమిండియా స్టారే పర్ఫెక్ట్ కోచ్!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్పై విడుదల
-
Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?