Supreme Court: ప్రభుత్వ ఉద్యోగాల నియామక నిబంధనలు మధ్యలో మార్చొద్దు..
- సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
- ప్రభుత్వ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియను మధ్యలోనే ఆపలేమన్న కోర్టు
- మొదట నిబంధనలు సిద్ధం చేయాలి
- ఆ తర్వాతే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించాలన్న కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుప్రీంకోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలకు సంబంధించిన నిబంధనలను మార్చలేమని కోర్టు పేర్కొంది. పోస్టుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నియమాలను మధ్యలో మార్చలేమని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ కేసు రాజస్థాన్ హైకోర్టులో ఓ ప్రభుత్వ పోస్టు రిక్రూట్మెంట్కు సంబంధించినది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పుల చెప్పింది. సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.
READ MORE: Stock Market: ట్రంప్ జోష్ ఒక్కరోజులోనే ఆవిరి.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
Also Read
- Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
- T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
- Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
- Indian Railway: ఇండియన్ రైల్వేలో సరికొత్త విప్లవం.. టెక్నాలజీ వాడకంలో భారత్ నెక్స్ట్ లెవెల్..
జస్టిస్ హ్రిషికేశ్ రాయ్, జస్టిస్ పీఎన్ నరసింహ, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. 2008లో కె.మంజుశ్రీ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బెంచి సమర్థించింది. ఆ కేసు తీర్పు సరైనదని.. దానిని తప్పు అని చెప్పడానికి అవకాశం లేదని పేర్కొంది. “ప్రభుత్వాలు నియామక ప్రక్రియకు ముందే నిబంధనలు సిద్ధం చేసి ఆ తర్వాతే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలి. చివరికి ఖాళీలను పూరించిన తర్వాత ఆ ప్రక్రియ ముగుస్తుంది. నిబంధనలు మార్చొచ్చని ముందుగానే చెబితే పర్వాలేదు. నియామక ప్రక్రియ నిబంధనలు ఎవరికి నచ్చినట్లు వారు మార్చడానికి వీల్లేదు. కచ్చితంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు అనుగుణంగా ఉండాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలి. మధ్యలో నిబంధనలు మార్చి అభ్యర్థులను ఇబ్బందిపెట్టరాదు.” అని ధర్మాసనం పేర్కొంది.
READ MORE:Australia: ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. 16ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!
తాజావార్తలు
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
-
Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
-
Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
-
Indian Railway: ఇండియన్ రైల్వేలో సరికొత్త విప్లవం.. టెక్నాలజీ వాడకంలో భారత్ నెక్స్ట్ లెవెల్..
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!