Supreme Court: అనర్హుల జేబుల్లోకి చేరుతోందా? రేషన్ పంపిణీపై సుప్రీం ప్రశ్న..
- నేడు ఓ కేసును విచారించిన సుప్రీంకోర్టు
- రేషన్ పంపిణీపై ప్రభుత్వాలకు ప్రశ్నలు
- లబ్ధిదారులకు చేరుతున్నాయా? అని ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు ఒక కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు పలు ప్రశ్నలు సంధించింది. దేశంలోని పలు రాష్ట్రాలు రేషన్ పంపిణీ వ్యవస్థల ద్వారా నిరుపేదలకు సబ్సిడీతో కూడిన నిత్యావసర సరకులను సరఫరా చేస్తున్నామని చెప్పుకుంటున్నట్లు గుర్తు చేసింది. అయితే ఈ రేషన్ బీపీఎల్(దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు) లబ్ధిదారుల కుటుంబాలకు చేరడం లేదని పేర్కొంది. రాష్ట్రాలు రేషన్ కార్డులను ప్రదర్శన కోసం ఉపయోగిస్తున్నారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రేషన్ కార్డు ప్రయోజనాలు నిజంగా లబ్ధిదారులకు చేరుతున్నాయా? లే అర్హత లేని వ్యక్తుల జేబుల్లోకి చేరుతున్నాయా? అని సుప్రీం అడిగింది. సుప్రీంకోర్టులో జస్టిస్ సూర్యకాంత్, ఎన్. కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం ఈ ప్రశ్నలు సంధించింది. అధిక మొత్తంలో రేషన్ కార్డులు జారీ చేశామని చెప్పుకునే రాష్ట్రాలు రేషన్ కార్డులను ప్రదర్శన కోసం ఉపయోగిస్తున్నాయని కోర్టు మండిపడింది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో వలస కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దాఖలైన కేసును విచారించిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
READ MORE:Mammootty : మమ్ముట్టి కోసం స్టార్ హీరో ప్రత్యేక పూజలు
Also Read
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
ఇదిలా ఉండగా. ఆదాయపు పన్ను చెల్లించేవారికి ఉచిత రేషన్ కట్ చేసేందుకు ఇప్పటికే కేంద్ర చర్యలు తీసుకుంటోంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం(పీఎంజీకేఏవై) కింద లబ్ధి పొందుతున్న వారిలో అనర్హుల్ని ఏరివేయడానికి కేంద్రం నడుం బిగించింది. ఈ విషయంలో ఆదాయపుపన్ను శాఖ కేంద్ర ఆహార శాఖకు సహకారం అందించింది. లబ్ధిదారుల ఆదాయ వివరాలను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్(డీఎఫ్పీడీ) విభాగానికి చెందిన సంయుక్త కార్యదర్శికి ఐటీ శాఖ సమకూరుస్తుంది. లబ్ధిదారుల ఆధార్ నంబర్ లేదా పాన్ వివరాలను ఆదాయపుపన్ను శాఖకు డీఎఫ్పీడీ అందిస్తుంది. దీని ఆధారంగా లబ్ధిదారుని ఆర్థిక స్థాయిని ఆదాయపుపన్ను శాఖ నిర్ధారించి ఆ వివరాలను ఆహారశాఖకు తిరిగి అందిస్తుంది.
READ MORE: KTR : కేటీఆర్పై నమోదైన కేసు కొట్టివేత
తాజావార్తలు
-
KS Bharat Retirement: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్..
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..