Nagpur riots: నాగ్పూర్ అల్లర్ల కీలక సూత్రధారి ఫాహిమ్ ఖాన్ అరెస్ట్..
- నాగ్పూర్ అల్లర్ల కీలక సూత్రధారి ఫాహిమ్ ఖాన్ అరెస్ట్..
- ఔరంగజేబు సమాధి వివాదంతో ఇటీవల అల్లర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagpur riots: మొఘల్ పాలకుడు ఔరంగజేబు సమాధి వివాదం నేపథ్యంలో, నాగ్పూర్లో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లలో ముఖ్యంగా ఒక వర్గం ఇళ్లను, వ్యాపారాలను టార్గెట్ చేస్తూ కొందరు ముస్లిం మూక దాడులకు పాల్పడింది. అయితే, ఈ అల్లర్లకు సంబంధించి కీలక సూత్రధారి ఫహీమ్ ఖాన్ని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. మైనారిటీ డెమోక్రటిక్ పార్టీకి చెందిన స్థానిక రాజకీయ నాయకుడైన ఇతడిని శుక్రవారం వరకు కస్టడీక పంపారు. ఈ అల్లర్లతో సంబంధం ఉన్న 60 మందిని అరెస్ట్ చేశారు. అదే సమయంలో పోలీసులు.. ఈ హింసకు కారణం ఒక వ్యక్తి లేదా సంస్థ అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 6 కేసులు నమోదయ్యాయి. 1200 మందిపై ఫిర్యాదులు అందాయి. వీరిలో ఇప్పటి వరకు 200 కంటే తక్కువ మంది పేర్లు నమోదయ్యాయి. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Read Also: Chahal – Dhanashree: చాహల్-ధనశ్రీ విడాకులపై రేపు తీర్పు.. భరణం ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా..
Also Read
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
ఛత్రపతి శంభాజీ నగర్(ఔరంగాబాద్)లో ఉన్న ఔరంగజేబు మసీదును తొలగించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పవిత్ర వ్యాఖ్యలు కలిగిన వస్త్రాన్ని తగలబెట్టారనే పుకార్లు రావడంతో, నమాజ్ ముగిసిన తర్వాత 250 మంది నినాదాలు చేస్తూ అల్లర్లను ప్రారంభించారు. ప్రజల వాహనాలకు నిప్పంటించారు. పోలీసులు, స్థానికులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే మంగళవారం మాట్లాడుతూ.. ఈ హింస ‘‘ముందస్తు కుట్ర’’గా అభివర్ణించారు. ఒక వర్గం వారి ఆస్తులు, ఇళ్లను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడ్డారని చెప్పారు. ‘‘ఛావా’’ సినిమా తర్వాత శంభాజీ మహరాజ్, మొఘల్ పాలకుల మధ్య వివాదాన్ని తెరపైకి తెచ్చింది. ఈ సినిమా తర్వాత మహారాష్ట్ర అంతటా భావోద్వేగాలు పెళ్లుబికాయి. దీంతోనే ఔరంగజేబు మసీదుని తొలగించాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Vivo T5 5G: వివో T5 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 7,050mAh బ్యాటరీ, 144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే
-
Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
-
Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
-
TVS iQube MillionR Edition: 145KM రేంజ్తో TVS iQube కొత్త అవతార్.. 35.5L స్టోరేజ్, USB-C పోర్ట్తో MillionR Edition!
ట్రెండింగ్
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!