Nagpur riots: మొఘల్ పాలకుడు ఔరంగజేబు సమాధి వివాదం నేపథ్యంలో, నాగ్పూర్లో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లలో ముఖ్యంగా ఒక వర్గం ఇళ్లను, వ్యాపారాలను టార్గెట్ చేస్తూ కొందరు ముస్లిం మూక దాడులకు పాల్పడింది. అయితే, ఈ అల్లర్లకు సంబంధించి కీలక సూత్రధారి ఫహీమ్ ఖాన్ని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. మైనారిటీ డెమోక్రటిక్ పార్టీకి చెందిన స్థానిక రాజకీయ నాయకుడైన ఇతడిని శుక్రవారం వరకు కస్టడీక పంపారు. ఈ అల్లర్లతో సంబంధం ఉన్న 60 మందిని అరెస్ట్ చేశారు. అదే సమయంలో పోలీసులు.. ఈ హింసకు కారణం ఒక వ్యక్తి లేదా సంస్థ అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 6 కేసులు నమోదయ్యాయి. 1200 మందిపై ఫిర్యాదులు అందాయి. వీరిలో ఇప్పటి వరకు 200 కంటే తక్కువ మంది పేర్లు నమోదయ్యాయి. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Read Also: Chahal – Dhanashree: చాహల్-ధనశ్రీ విడాకులపై రేపు తీర్పు.. భరణం ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా..
ఛత్రపతి శంభాజీ నగర్(ఔరంగాబాద్)లో ఉన్న ఔరంగజేబు మసీదును తొలగించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పవిత్ర వ్యాఖ్యలు కలిగిన వస్త్రాన్ని తగలబెట్టారనే పుకార్లు రావడంతో, నమాజ్ ముగిసిన తర్వాత 250 మంది నినాదాలు చేస్తూ అల్లర్లను ప్రారంభించారు. ప్రజల వాహనాలకు నిప్పంటించారు. పోలీసులు, స్థానికులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే మంగళవారం మాట్లాడుతూ.. ఈ హింస ‘‘ముందస్తు కుట్ర’’గా అభివర్ణించారు. ఒక వర్గం వారి ఆస్తులు, ఇళ్లను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడ్డారని చెప్పారు. ‘‘ఛావా’’ సినిమా తర్వాత శంభాజీ మహరాజ్, మొఘల్ పాలకుల మధ్య వివాదాన్ని తెరపైకి తెచ్చింది. ఈ సినిమా తర్వాత మహారాష్ట్ర అంతటా భావోద్వేగాలు పెళ్లుబికాయి. దీంతోనే ఔరంగజేబు మసీదుని తొలగించాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.