Press Sticker: వాహనాలపై PRESS స్టిక్కర్లు.. సుప్రీం కోర్టు ఏమందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వినియోగం శృతిమించుతోంది. ముఖ్యంగా పోలీసుల విచారణలో ఉన్న నిందితుల ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడం, వాహనాలపై ‘మీడియా’ స్టిక్కర్లు వేసుకుని తిరగడం వంటి అంశాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు విచారణ పూర్తికాకముందే నిందితులను దోషులుగా చిత్రీకరించేలా సాగుతున్న ఈ ధోరణి పట్ల ధర్మాసనం ఆందోళన చెందింది.
నగరాల్లో చాలామంది తమ వ్యక్తిగత వాహనాలపై ‘మీడియా’ అని స్టిక్కర్లు అంటించుకుని తిరగడంపై జస్టిస్ బాగ్చీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, ఇది ఒక రకమైన ‘డిజిటల్ అరెస్ట్’ లాంటిదని అభిప్రాయపడ్డారు. అంటే.. అధికారం లేకపోయినా మీడియా పేరుతో చట్టవిరుద్ధంగా వ్యవహరించడం లేదా ఇతరులను భయభ్రాంతులకు గురిచేయడం వంటివి జరుగుతున్నాయని కోర్టు భావించింది. టీవీ ఛానెళ్ల కంటే సోషల్ మీడియాలో నియంత్రణ తక్కువగా ఉందని, మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ తామే మీడియా అని భావించడం వల్ల ‘న్యాయమైన విచారణ’ కు విఘాతం కలుగుతోందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
Also Read
- Turmeric Stains Remove Tips: బట్టలపై పసుపు మరకలతో ఇబ్బందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో శుభ్రం చేసుకోండి
- CM Revanth: విద్యార్థులపై దాడులు అమానుషం.. నీట్ వ్యవహారంపై కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్..!
- Rahul Gandhi: రక్తం ఓడుతున్న ముఖం, ఊడిపోయిన షూ.. ప్రధాని ఇంటి ముట్టడితో మారిన రాహుల్ గాంధీ పొలిటికల్ మార్క్!
- Delhi protests: హస్తినలో ఆగని ఆందోళనలు.. 16 మెట్రో స్టేషన్లు మూసివేత.. ఆంక్షలు..
పోలీసుల అత్యుత్సాహంపై చురకలు
నిందితులను మోకాళ్లపై కూర్చోబెట్టడం, తాళ్లతో కట్టడం లేదా వీధుల్లో ఊరేగించడం వంటి దృశ్యాలను పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో నిందితులపై ముందే ఒక ప్రతికూల భావన ఏర్పడుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదించారు. దర్యాప్తు సంస్థల పని బాధితులకు లేదా నిందితులకు అనుకూలంగా ఉండటం కాదని, కేవలం నిజాన్ని వెలికితీయడమేనని కోర్టు గుర్తుచేసింది. పోలీసుల మీడియా బ్రీఫింగ్లు విచారణను ప్రభావితం చేసేలా ఉండకూడదని స్పష్టం చేసింది.
సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు కేవలం బ్లాక్ మెయిలింగ్ కోసమే నడుస్తున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన కోర్టు, పోలీసుల మీడియా బ్రీఫింగ్లకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించాలని రాష్ట్రాలకు ఇప్పటికే మూడు నెలల గడువు ఇచ్చామని తెలిపింది. ఈ అంశంపై మరింత లోతైన అధ్యయనం అవసరమని భావించిన కోర్టు.. ఏప్రిల్ తర్వాత పూర్తి వివరాలతో రావాలని సూచించడంతో పిటిషనర్ తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు.
తాజావార్తలు
-
VW 24 inch QLED TV: VW 24 ఇంచెస్ HD Ready QLED TV.. రూ.5 వేలలోనే బెస్ట్ బడ్జెట్ టీవీ!
-
Turmeric Stains Remove Tips: బట్టలపై పసుపు మరకలతో ఇబ్బందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో శుభ్రం చేసుకోండి
-
CM Revanth: విద్యార్థులపై దాడులు అమానుషం.. నీట్ వ్యవహారంపై కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్..!
-
RRB JE Recruitment 2026: రైల్వేలో 4,098 జూనియర్ ఇంజనీర్ పోస్టులు.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు
-
Rahul Gandhi: రక్తం ఓడుతున్న ముఖం, ఊడిపోయిన షూ.. ప్రధాని ఇంటి ముట్టడితో మారిన రాహుల్ గాంధీ పొలిటికల్ మార్క్!
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!