Hijab: “ఏ దుస్తులు వేసుకోవాలో మీరెలా నిర్ణయిస్తారు”.. హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- హిజాబ్.. బురఖా.. నిఖాబ్ ధరించడంపై నిషేధం విధించిన కళాశాల
- బాంబే కోర్టుకు వెళ్లిన ముస్లిం విద్యార్థినులు
- యాజమాన్యానికి అనుకూలంగా తీర్పు చెప్పిన కోర్టు
- దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించిన విద్యార్థినులు
- నిబంధనపై పాక్షికంగా స్టే విధించిన అత్యున్నత న్యాయస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిజాబ్, బురఖా, నిఖాబ్ ధరించడంపై నిషేధం ఉన్న ముంబైలోని ఓ ప్రైవేట్ కాలేజీ సూచనలను సుప్రీంకోర్టు పాక్షికంగా స్టే విధించింది. ఎన్జీ ఆచార్య అండ్ డీకే మరాఠే కాలేజీని నిర్వహిస్తున్న ‘చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీ’కి నవంబర్ 18లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. క్యాంపస్లో హిజాబ్, బురఖాలకు వ్యతిరేకంగా ముంబయిలోని ఎన్జీ ఆచార్య అండ్ డీకే మరాఠీ కాలేజీ ఇటీవల సర్క్యులర్ను జారీచేసిన సంగతి తెలిసిందే. కాలేజీ ఆదేశాలను సవాలు చేస్తూ ముస్లిం విద్యార్థులు బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు కళాశాలకు అనుకూలంగా తీర్పు చెప్పడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాలేజీ ఆదేశాలపై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.
READ MORE: Triple Murder In Bihar: ఒకే కుటుంబంలో ముగ్గురు హత్య.. విషమంగా ఒకరి పరిస్థితి..!
Also Read
- Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
- AP High Court: డీఎస్సీ-2025 పిల్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్ను వాడొద్దు..!
- Sunetra Pawar: సునేత్ర పవార్ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
- Colleges Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు విద్యాసంస్థలు బంద్..
యాజమాన్యం తరఫు న్యాయవాది మాధవి దివాన్ తన వాదనలు వినిపించారు. విద్యార్థుల మతం బహిర్గతం చేయకూడదనే లక్ష్యంతో ఈ నిబంధన పెట్టినట్లు కోర్టుకు తెలిపారు. దీంతో ఒక్కసారిగా న్యాయమూర్తులు మండిపడ్డారు. విద్యార్థుల పేర్లలో మతం ప్రతిబింబించలేదా? పిల్లలను వారి రోల్ నంబర్లను బట్టి పిలుస్తారా?, మతాన్ని బహిర్గతం చేయొద్దనేది మీ ఉద్దేశమైతే విద్యార్థులు బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నారు? బొట్టు పెట్టుకోవడాన్ని ఎందుకు నిషేధించలేదు? ఇలాంటి నిబంధనలను అమలు చేయడం అంటే మతాన్ని బయటపెట్టడం కాదా? అని న్యాయస్థానం ప్రశ్నించింది.
READ MORE: Bandi Sanjay: 8 రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. మోడీ సంకల్పానికి సాక్ష్యం..
కాలేజీ ఎప్పటి నుంచి నడుస్తోంది అని జస్టిస్ ప్రశ్నించారు. 2008 నుంచి ఉనికిలో ఉందని మాధవి దేవాన్ బదులిచ్చారు. దీనిపై న్యాయమూర్తి మాట్లాడుతూ.. ‘ఇన్నేళ్లుగా మీరు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు.. మీకు హఠాత్తుగా ఎందుకు గుర్తుకు వచ్చింది? ఇన్నేళ్ల తర్వాత మీరు ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం విచారకరం. బొట్టుతో వచ్చే విద్యార్థులను అనుమతించబోమని చెప్పగలరా? అని నిలదీసింది. దీనిపై మాధవి దివాన్ మాట్లాడుతూ.. ‘441 మంది ముస్లిం విద్యార్థులు కళాశాలకు ఆనందంగా హాజరయ్యారు. ఈ నిబంధనలపై కొంతమంది విద్యార్థులు మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.” అని తెలిపారు. “అమ్మాయిలు ఏ దుస్తులు వేసుకోవాలో మీరెలా నిర్ణయిస్తారు.. అమ్మాయిలు ఏ రకమైన దుస్తులు వేసుకోవాలనుకుంటున్నారో వారికే వదిలేయాలి” అని కోర్టు వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
-
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
-
Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
-
AP High Court: డీఎస్సీ-2025 పిల్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్ను వాడొద్దు..!
-
Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!