ఢిల్లీ కోర్టులో కాల్పుల ఘటనపై సుప్రీం కోర్టు సీజే ఆరా !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ కోర్టులో కాల్పుల ఘటనపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. ఢిల్లీ హైకోర్టు సీజేతో మాట్లాడారు. కోర్టు కార్యకలాపాలకు భంగం కలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఢిల్లీ పోలీసులు, లాయర్లు కోర్టు కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడాలని కోరారు. కోర్టుల భద్రత అంశం సుప్రీం కోర్టు పరిశీలనలో ఉందని, ఈ కాల్పుల ఘటనతో భద్రత మళ్లీ చర్చనీయాంశమైందన్నారు. కోర్టుల భద్రత అంశంపై వచ్చేవారం చర్చిస్తామని చెప్పారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.శుక్రవారం ఢిల్లీ రోహిణి కోర్టులో తుపాకుల మోత మోగింది. లాయర్ల దుస్తుల్లో వచ్చిన ఇద్దరు దుండగులు గ్యాంగ్ స్టర్ జితేందర్ గోగిని కాల్చి చంపారు.
Also Read
- Earthquake: ఇండోనేషియాలో వరసగా భారీ భూకంపాలు.. అసలు కారణాలేంటి.?
- IND Vs SL: మొదటి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్.. రెండో రోజు ముగిసిన ఆట..
- Visaka Airport: 40 ఏళ్ల నాటి అనుబంధం నేటితో ముగింపు.. భావోద్వేగంతో వీడ్కోలు..
- Sonipat Viral Incident: వీడియో కాల్లో తండ్రి అంత్యక్రియలు.. కర్మలకు కూడా రాని కుమార్తెలు
వెంటనే అలర్టయిన పోలీసులు… నిందితులపై కాల్పులు జరిపి హతమార్చారు. కాల్పుల మోతతో కోర్టు ప్రాంగణం దద్దరిల్లింది. మొత్తం 30 నుంచి 40 రౌండ్ల కాల్పులు జరిగినట్లు భావిస్తున్నారు. రూమ్ నెంబర్ 207లో ఈ కాల్పులు జరిగాయి. ఢిల్లీకి చెందిన టిల్లూ గ్యాంగ్ జితేంద్రను హత్య చేసినట్లు తెలుస్తోంది. జితేందర్ గోగిని చంపడానికి టిల్లు గ్యాంగ్ చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. 2015లోనే టిల్లును పోలీసులు అరెస్ట్ చేశారు. తన గ్యాంగ్ను తుడిచిపెట్టేసిన జితేందర్పై కసితో ఉన్న టిల్లు అప్పట్నుంచి పగతో రగిలిపోతున్నాడు. జైలు నుంచే జితేందర్ గోగి హత్యకు కుట్రపన్నాడు. సక్సెస్ అయ్యాడు.
ఈ ఘటనతతో రోహిణీ కోర్టులో భద్రతా వైఫల్యం స్పష్టమైంది. పటిష్ఠ భద్రత ఉండే కోర్టులోకి తుపాకులు ఎలా వచ్చాయనేది ప్రశ్నగా మారింది. లోపలకు వెళ్లే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అయినప్పటికీ ఆయుధాలు లోపలకు ఎలా తీసుకెళ్లారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అక్కడ భద్రతా వైఫల్యం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కోర్టులోకి ఎవరు వస్తున్నారు, ఏం తెస్తున్నారనేది పోలీసులు ఎప్పుడూ పట్టించుకోరని లాయర్లు కూడా ఆరోపిస్తున్నారు
తాజావార్తలు
-
Earthquake: ఇండోనేషియాలో వరసగా భారీ భూకంపాలు.. అసలు కారణాలేంటి.?
-
CM Revanth Reddy : సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాలు పెడతా.. కేసీఆర్ను కూడా తీసుకురండి
-
IND Vs SL: మొదటి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్.. రెండో రోజు ముగిసిన ఆట..
-
Visaka Airport: 40 ఏళ్ల నాటి అనుబంధం నేటితో ముగింపు.. భావోద్వేగంతో వీడ్కోలు..
-
CM Revanth Reddy : పరకాలకు సీఎం రేవంత్ వరాలు.. రూ.400 కోట్లకు పైగా అభివృద్ధి పనులు.!
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?