Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Politics: కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. డీకే శివకుమార్ క్యాబినెట్ ఏర్పాటైన వెనువెంటనే అసంతృప్తులు మొదలయ్యాయి. సీనియర్ కాంగ్రెస్ నేత, కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి తనకు కేటాయించిన శాఖపై తీవ్ర అసంతృప్తితో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తనకు అత్యంత కీలకమైన ‘బెంగళూరు అభివృద్ధి’ (బెంగళూరు డెవలప్మెంట్) శాఖ దక్కుతుందని ఆశించగా, అది కాస్తా చేజారడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ శాఖను తనకు కేటాయించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కెమెరాల ముందే తన రాజీనామా లేఖపై సంతకం చేసిన రామలింగారెడ్డి, ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను పంచుకున్నారు. ఈ పదవిని తనకు ఇస్తామని రెండుసార్లు మాట ఇచ్చారని, కానీ ఇప్పుడు తీవ్ర నిరాశే మిగిలిందని చెప్పారు. బెంగళూరు అభివృద్ధి శాఖను నాకే ఇస్తానని డీకే శివకుమార్ స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. ఈ రాజీనామా లేఖను ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా పంపించనున్నట్లు తెలుస్తోంది.
ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఉన్న రామలింగారెడ్డి.. బెంగళూరు అభివృద్ధి శాఖ మినహా మరే ఇతర మంత్రిత్వ శాఖను చేపట్టే ప్రసక్తే లేదని ఖచ్చితంగా తేల్చి చెప్పారు. అయితే, ఆయనకు మాత్రం ‘భారీ, మధ్యతరహా నీటిపారుదల’ (మేజర్ అండ్ మీడియం ఇరిగేషన్) శాఖను కేటాయించారు. ఈ పరిణామం కర్ణాటక ప్రభుత్వ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు డీకే శివకుమార్ తన వద్దే ఆర్థిక శాఖను ఉంచుకోగా, అంతకుముందు ఉప ముఖ్యమంత్రిగా తన వద్ద ఉన్న బెంగళూరు అభివృద్ధి శాఖను మాత్రం వదులుకున్నారు. కర్ణాటక ప్రభుత్వంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, కీలకమైన శాఖగా పేరున్న ఈ బెంగళూరు అభివృద్ధి శాఖను ఇప్పుడు కృష్ణ బైరేగౌడకు కేటాయించారు. ఈ శాఖ కోసం పట్టుబట్టిన రామలింగారెడ్డి, డీకే శివకుమార్తో జరిగిన సమావేశాల్లోనూ తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. వేరే ఏ శాఖను అంగీకరించేందుకు సుముఖంగా లేరు.
Also Read
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
72 ఏళ్ల వయసున్న రామలింగారెడ్డి బెంగళూరులోని బీటీఎమ్ లేఅవుట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో సిద్ధరామయ్య ప్రభుత్వంలో ఆయన రవాణా, హిందూ ధార్మిక దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు. అంతకుముందు హోం మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఆయనకు ఉంది. ఇదిలా ఉంటే, గత సిద్ధరామయ్య ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన 53 ఏళ్ల కృష్ణ బైరేగౌడకు ఇప్పుడు అత్యంత డిమాండ్ ఉన్న బెంగళూరు అభివృద్ధి శాఖ దక్కింది. కర్ణాటక రాజకీయాల్లో ప్రముఖ వొక్కలిగ సామాజికవర్గ నేతగా గుర్తింపు పొందిన కృష్ణ బైరేగౌడది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆయన తండ్రి సి. బైరేగౌడ గతంలో కర్ణాటక శాసనసభకు డిప్యూటీ స్పీకర్గా, వ్యవసాయ శాఖ మంత్రిగా సేవలు అందించారు. ప్రస్తుతం కృష్ణ బైరేగౌడ బేగూరు సమీపంలోని బ్యాటరాయనపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేత రామలింగారెడ్డి రాజీనామా వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
-
Shivam Dube: ధోనీ vs రోహిత్.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ టీ20 కెప్టెన్.. దూబేకు పెద్ద సమస్యే వచ్చిందే!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!