Sukhbir Badal: ‘మద్యం మత్తులో ఉన్న సీఎంను విమానం నుంచి దించేశారు..’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sukhbir Badal: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్పై శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్ తీవ్ర ఆరోపణలు చేశారు. మద్యం మత్తులో, కనీసం నడవలేని స్థితిలో ఉన్న పంజాబ్ సీఎంను విమానం నుంచి దించేశారని ఆరోపించారు. శనివారం మాన్తోపాటు జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి దిల్లీ వస్తున్న విమానంలో ఉన్న ప్రయాణికులు ఈ విషయం చెప్పారంటూ ట్వీట్ చేశారు. దీని వల్ల విమానం నాలుగు గంటలు ఆలస్యం అయింది. ఆప్ జాతీయ కార్యవర్గ సమావేశాలకు భగవంత్ మాన్ హాజరు కాలేకపోయారు. ఈ వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పంజాబీలను సిగ్గుపడేలా చేశాయంటూ బాదల్ ట్వీట్ చేశారు. ఈ అంశంపై పంజాబ్ ప్రభుత్వం మౌనం వహించడంపై ఆయన మండిపడ్డారు. ఈ సంఘటనపై వివరణలు కోరారు. పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో సహా ఆప్ నేతలను కూడా ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు
“పంజాబ్ సహా జాతి గౌరవంతో ముడిపడిన ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి. ఆయన్ను విమానం నుంచి దించేయడం నిజమే అయితే.. ఇదే విషయంపై జర్మనీ ప్రభుత్వంతో కేంద్రం మాట్లాడాలి” అని ట్వీట్ చేశారు బాదల్. అంతకుముందు ఆగస్టు 31న, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్తో సహా ఒక ప్రతినిధి బృందం పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్కు మెమోరాండం సమర్పించి, రాష్ట్ర ఎక్సైజ్ పాలసీపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసింది.పాలసీలో కుంభకోణం జరిగిందని ప్రతినిధి బృందం ఆరోపించింది. ‘ఢిల్లీలో జరిగినట్లుగానే పంజాబ్ ఎక్సైజ్ పాలసీలోనూ స్కామ్ జరిగింది. ఢిల్లీ ఎల్జీ ఎక్సైజ్ పాలసీ కేసుపై విచారణకు ఆదేశించినట్లుగా, పంజాబ్లోనూ అదే తరహాలో సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం’’ అని బాదల్ అన్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
Assault on lift giver: లిప్ట్ ఇచ్చిన వ్యక్తిపై ఇంజెక్షన్ తో దాడి.. ఆపై బైక్ తో..
పంజాబ్ విపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా కూడా ఈ ఘటనపై విస్మయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో భగవంత్ మాన్ది తప్పని తేలితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పంజాబ్ సర్కారును ఢిల్లీ దర్బార్ నడిపిస్తోందంటూ పరోక్షంగా కేజ్రీవాల్, రాఘవ్ చడ్ఢాలను ఉద్దేశించి ఆరోపణలు చేశారు. భగవంత్ మాన్పై చర్యలు తీసుకుంటారా లేదా అని కేజ్రీవాల్ను ప్రశ్నించారు. ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ 8 రోజుల జర్మనీ పర్యటనకు వెళ్లారు . ఆదివారం భారత్కు తిరిగొచ్చారు. అయితే ఆయన ప్రయాణించిన విమానం రాక ఆలస్యం కాగా.. ఈ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. వీటిని ఆమ్ఆద్మీ పార్టీ ఖండించింది. సీఎంను అగౌరపరిచేందుకు విపక్షాలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!