Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sugar Prices Fall: దేశంలో చక్కెర ధరల మంటతో ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకుతున్న చక్కెర ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సత్వర, కఠిన నిర్ణయాలతో బ్రేక్ పడింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా చక్కెర ఎక్స్-మిల్ (మిల్లుల వద్ద విక్రయించే) ధరలు ఏకంగా 18 శాతం మేర భారీగా పడిపోయాయి. దీంతో ప్రస్తుతం ఎక్స్-మిల్ వద్ద కిలో చక్కెర ధర రూ. 55కు దిగివచ్చింది. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత తగ్గుతాయని ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా స్పష్టం చేశారు.
గడిచిన 15 రోజుల్లో దేశీయ మార్కెట్లో చక్కెర ధరలు ఊహించని రీతిలో పెరిగిపోయాయి. మిల్లుల వద్ద ఎక్స్-మిల్ ధర రికార్డు స్థాయిలో కిలోకు రూ. 67కు చేరింది. సుగర్ మిల్లులు తమ ఇష్టారాజ్యంగా, ఏకపక్షంగా ధరలను పెంచడమే ఈ హఠాత్ పెరుగుదలకు ప్రధాన కారణమని సంజీవ్ చోప్రా వెల్లడించారు. మిల్లుల వద్ద ధరలు పెరగడంతో ఆ ప్రభావం హోల్సేల్, రిటైల్ మార్కెట్పై పడి సామాన్యుడి జేబుకు చిల్లు పడింది. ధరలు రూ. 67కు చేరిన వెంటనే అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్కెట్లో సరుకు కొరత ఏర్పడకుండా సరఫరాను పెంచేందుకు చక్కెర దిగుమతులకు తక్షణమే అనుమతి ఇచ్చింది.
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
విదేశీ చక్కెర అందుబాటులోకి రానుండటంతో కొరత భయాలు తొలగిపోయాయి. దీనికి తోడు చక్కెర స్పెక్యులేషన్ (సట్టేబాజీ), అక్రమ నిల్వలు (జమాఖోరీ) చేసే వారిపై కఠిన చర్యలు చేపట్టింది. బ్లాక్ మార్కెట్ నిరోధానికి కఠిన నిబంధనలు, నిఘా అమల్లోకి తెచ్చి లాభాపేక్షపరుల ఆట కట్టించింది. ఈ నిర్ణయాల ప్రభావంతో సుగర్ మిల్లులు వెంటనే దిగిరాక తప్పలేదు. దాంతో రూ. 67గా ఉన్న ఎక్స్-మిల్ ధర ఒక్కసారిగా రూ. 55కు పడిపోయింది. దిగుమతి చేసుకున్న చక్కెర మార్కెట్కు చేరి, సరఫరా వ్యవస్థ పుంజుకుంటే రాబోయే రోజుల్లో ఎక్స్-మిల్ ధరలు మరింత తగ్గుతాయని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది. మిల్లుల వద్ద ధర తగ్గడం వల్ల ఆ ప్రయోజనం హోల్సేల్ ద్వారా త్వరలోనే రిటైల్ మార్కెట్కూ చేరనుంది. ఫలితంగా రాబోయే కొద్ది రోజుల్లోనే మీ సమీపంలోని కిరాణా కొట్టులోనూ చక్కెర తక్కువ ధరకే లభించనుంది.
తాజావార్తలు
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్థాన్తో తొలి టీ20 మ్యాచ్.. అద్భుత పోరాటం చేసిన ఒమర్జాయ్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!