Success Story: తల్లికి వాగ్దానం చేసి.. 150కి పైగా డిగ్రీలు చేసిన కొడుకు! టర్గెట్ ఏంటో తెలుసా?
- 150కి పైగా డిగ్రీలు చేసిన పార్థిబన్
- ప్రేరణ ఎక్కడినుంచి మొదలైందో తెలుసా?
- ప్రొఫెసర్ పార్థిబన్ టర్గెట్ ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనలో చాలా మందికి ‘ఫైనల్ పరీక్షలు’ అంటే ఓ ప్రయాణంకు ముగింపు, కొత్త జీవితానికి నాంది. కానీ చెన్నైకి చెందిన ఒక వ్యక్తికి విద్య గమ్యస్థానం కాదు.. జీవితాంతం కొనసాగే ప్రయాణం. తల్లికి వాగ్దానం చేసి 150కి పైగా డిగ్రీలు చేశారు. అతని పేరు ప్రొఫెసర్ డాక్టర్ వి.ఎన్. పార్థిబన్. ఆయనను ‘డిగ్రీల భాండాగారం, ‘వాకింగ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ నాలెడ్జ్’ అని పిలుస్తారు. కానీ ఈ అద్భుతమైన ప్రయాణానికి ప్రొఫెసర్ పార్థిబన్ ప్రేరణ ఎక్కడినుంచి మొదలైందో తెలుసా?. తన తల్లికి చేసిన వాగ్దానంతో అతడి ప్రయాణం ప్రారంభమైంది. ఈ విషయాన్ని పార్థిబన్ స్వయంగా చెప్పారు.
ప్రొఫెసర్ పార్థిబన్ తన మొదటి డిగ్రీని అతి కష్టం మీద పాసయ్యారు. తక్కువ మార్కులు చూసి అతని తల్లి చాలా బాధపడ్డారు. ఆ క్షణమే అతని జీవితంలో ఒక మలుపు తిరిగింది. కేవలం ఉత్తీర్ణుడవ్వడమే కాదు.. గొప్పగా రాణించాలని నిర్ణయించుకున్నారు. ఒక రోజు నిన్ను గర్వపడేలా చేస్తా అమ్మా అని పార్థిబన్ వాగ్దానం చేశారు. తన తల్లికి ఇచ్చిన ఆ వాగ్దానం క్రమంగా ఓ అభిరుచిగా మారింది. చదువు నాలుగు దశాబ్దాలకు పైగా తీరని దాహంగా మారింది. 1981 నుండి నేటి వరకు అతను చదువు ఆపలేదు. మొదట్లో పరీక్షలో బాగా రాణించాలనే లక్ష్యం.. ఇప్పుడు జ్ఞానం కోసం అపరిమితమైన దాహంగా మారింది.
Also Read
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
Also Read: World Cup 2025: సెమీఫైనల్ రేసు రసవత్తరం.. న్యూజిలాండ్తోనే భారత్కు ముప్పు! శ్రీలంక ఉన్నా
ప్రొఫెసర్ పార్థిబన్ సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ఇప్పటివరకు 150 డిగ్రీలు, డిప్లొమాలు సంపాదించారు. ఆర్థిక శాస్త్రం, ప్రజా పరిపాలన, రాజకీయ శాస్త్రం, చట్టం వంటి అంశాలలో అనేక మాస్టర్స్ డిగ్రీలను కలిగి ఉన్నారు. 12 M.Phil. డిగ్రీలను సంపాదించారు. ప్రస్తుతం నాల్గవ Ph.D. చదువుతున్నారు. పార్థిబన్ తన చదువులకు సొంత సంపాదననే వాడుకుంటారు. తన జీతంలో దాదాపు 90 శాతం డబ్బు చదువులకే ఖర్చు చేశారు. విశ్వవిద్యాలయ ఫీజులు, పుస్తకాలు, అధ్యయన సామగ్రికి డబ్బు ఖర్చు చేశారు. 150 డిగ్రీలకు పైగా సంపాదించిన తాను చదువు ఆపనని, 200 డిగ్రీలకు పైగా సాధించడమే తన లక్ష్యం అని పార్థిబన్ చెప్పారు.
తాజావార్తలు
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్లో భారీ హైప్
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!