Supreme Court: రేపటిలోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సమర్పించండి.. ఎస్బీఐకి సుప్రీం ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ఎన్నికల బాండ్లవివరాల వెల్లడికి ఎస్బీఐ అదనపు సమయం కోరడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత ఎన్నికల కమిషన్కు అన్ని ఎలక్టోరల్ బాండ్ లావాదేవీల వివరాలను అందించడానికి అదనపు సమయం కావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు డేటాను సమర్పించాలని ఎస్బీఐని కోరింది. మార్చి 6లోగా వివరాలను వెల్లడించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఎస్బీఐని కోర్టు మందలించింది. రేపటిలోగా సమాచారం అందించకపోతే ప్రభుత్వ ఆధీనంలోని బ్యాంకుపై ధిక్కార చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది.
Also Read
- Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
- Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై ఇజ్రాయెల్ అనుమానాలు!
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
- Green Moong Chaat Recipe: రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా..? సింపుల్గా హై ప్రోటీన్ పెసరపప్పు చాట్ ట్రై చేయండి..
అలాగే ఆ సమాచారాన్ని మార్చి 15 సాయంత్రం 5 గంటల్లోగా బహిర్గతపర్చాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడి చేయడానికి గడువును జూన్ 30 వరకూ పొడిగించాలంటూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. అంతకుముందు, ఇప్పుడు రద్దు చేయబడిన స్కీమ్ వివరాలను అందించడానికి మరింత సమయం కావాలని ఎస్బీఐ చేసిన అభ్యర్థనను విన్న సుప్రీం కోర్టు.. కఠినమైన ప్రశ్నలను వేసింది. గత 26 రోజులుగా బ్యాంక్ ఏం చేసిందని ప్రశ్నించింది. 2017లో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సవాలు చేసిన పిటిషనర్లలో ఒకటైన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) మరింత సమయం కావాలని ఎస్బీఐ చేసిన విజ్ఞప్తిని వ్యతిరేకించింది.
Read Also: Fitness : గోధుమపిండితో చేసిన చపాతీని రోజూ తింటే ఎన్ని లాభాలో తెలుసా?
ఇటీవల ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని ఎన్నికల కమిషన్కు ఇవ్వడానికి జూన్ 30 వరకు సమయం కావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును కోరింది. ఫిబ్రవరి 15న ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంలో, మార్చి 6లోగా ఎన్నికల కమిషన్కు జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని అందించాలని ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్చి 13లోగా సమాచారం అందించాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. వెబ్సైట్లో పబ్లిష్ చేయండి. ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చిన వారి సమాచారం అందించడానికి గడువును పొడిగించాలని డిమాండ్ చేస్తూ ఎస్బీఐ సుప్రీంకోర్టులో దరఖాస్తు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎస్బీఐ తీరుపై సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. మార్చి 12 సాయంత్రం పనిగంటలు ముగిసేలోగా దాతల వివరాలను మీరు ఎన్నికల సంఘానికి అందజేయాల్సిందేనని ఎస్బీఐకి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఆ వివరాలను వెబ్సైట్లో బహిర్గతపర్చాలని ఎన్నికల సంఘానికి సూచించింది.
తాజావార్తలు
-
SBI Apprentice Recruitment 2026: ఎస్బీఐలో 7150 పోస్టులు.. మంచి జీతం.. అర్హతలు, ఎంపిక పూర్తి వివరాలు
-
Mega 158: ‘మెగా’ డాటర్ ఫిక్స్.. సినిమాకే హైలైట్ అవ్వనుందా!
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ పైపైకి.. ఈరోజు తులం ఎంతంటే?
-
Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
-
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్టైమ్ రికార్డ్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!