Students Protest on Teacher: ఆ టీచర్ అంటే హడల్.. మాకొద్దు అంటూ నిరసన
కొంతమంది టీచర్లు విద్యార్ధులతో విడదీయరాని అనుబంధం పెంచుకుంటూ వుంటారు. వారు కొంతకాలం కనిపించకపోతే విద్యార్ధులు అల్లాడిపోతారు. వారు బదిలీ అయితే.. ఉన్నతాధికారులపై వత్తిడి తెస్తారు. బదిలీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతారు… ఇదంతా ఒక ఎత్తు.. కానీ మరికొంతమంది టీచర్లు ఛండశాసనులు.. వారంటే పిల్లలకు హడల్.. ఓ స్కూల్ టీచర్ ని చూస్తే విద్యార్థులు గజగజ వణికిపోతున్నారు. పాఠాలు నేర్పాల్సిన పంతులమ్మ తన పిడిగుద్దులతో విద్యార్థులకు,గ్రామస్థులకు చుక్కలు చూపిస్తుంది.
Read Also: Adivi Sesh: రెజీనా మ్యాగీ కామెంట్ కు ‘మేజర్’ షాకింగ్ రిప్లై.. నాకు స్టామినా ఎక్కువే
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఆ పాఠశాల పంతులమ్మను చూస్తేనే చాలు అందరూ జడుసుకుంటున్నారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన పంతులమ్మ తమ పట్ల సైకోలా ప్రవర్తిస్తుందనీ విద్యార్థులు వాపోతున్నారు.రేగోడ్ మండల ఎం.ఇ.వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. మెదక్ జిల్లా రేగోడ్ మండలం తిమ్మాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాల లోని ఉపాధ్యాయురాలు రజిత ను చూస్తే విద్యార్థుల గుండెల్లో గుబులు పుడుతుంది. చదువు,సంస్కారం,క్రమశిక్షణ నేర్పడంలో విద్యార్థులను దండిస్తుందనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. గ్రామర్ చెప్పే పంతులమ్మ సైకోలా ప్రవర్తిస్తూ విద్యార్థులను దండిస్తుందంటే మీరు నమ్మగలరా. కానీ ఇదే నిజం.

ఈ పాఠశాలలోని పంతులమ్మ రజిత మానసిక అనారోగ్యానికి గురై సైకోలా ప్రవర్తిస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. అకారణంగా తమపై చేయి చేసుకుంటుందని విద్యార్థినిలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో ఉపాధ్యాయురాలు రజితను నిలదీసేందుకు వెళ్లగా పిల్లల తల్లితండ్రులపై కూడా రజిత చేయి చేసుకున్నట్లు విద్యార్థుల తల్లితండ్రులు కూడా ఆరోపిస్తున్నారు.
Read Also:Icrisat: ఇండియాలోనే తొలిసారి.. పల్లీలను ఎక్స్రే తీసి క్వాలిటీ అందిస్తామంటున్న ఇక్రిశాట్
గత 8 నెలలుగా రజిత తమను వేధిస్తోందని విద్యార్ధులు అంటున్నారు. ఉపాధ్యాయురాలు రజిత గ్రామంలోని కల్లు దుకాణంలో కల్లు తాగి పాఠశాలకు వస్తుందని తాము పలుమార్లు తమ కళ్ళతో చూశామని గ్రామస్థులు ఎం.ఇ.ఓ కు ఫిర్యాదులు చేశారు. అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులతో కలిసి ఎం.ఇ.వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయురాలు రజిత మాకొద్దు అంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎలాగైనా రజిత మేడంను బదిలీ చేసి తమను కాపాడాలంటూ తిమ్మాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఎం.ఇ.వో ను కోరారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!