TSPSC: టీఎస్పీస్సీ పేపర్ లీకేజీలో మరో కోణం.. చాట్ జీపీటీతో ఏఈఈ పరీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSPSC: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రశ్నపత్రం లీక్ కేసు దేశంలోనే సంచలనం సృష్టించింది. ఈ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. లీకేజీకి పాల్పడిన వారు వ్యవస్థను మోసం చేయడానికి ChatGPTని ఉపయోగించారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE), డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (DAO) రిక్రూట్మెంట్ కోసం ప్రశ్నపత్రాలను కాపీ చేసిన తర్వాత నిందితులలో ఒకరు సమాధానాలు పొందడానికి AI సాంకేతికతను ఉపయోగించినట్లు లీక్పై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కనుగొంది. ముగ్గురు అభ్యర్థులు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లతో పరీక్షా కేంద్రంలోకి రాగా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఓ వ్యక్తి సమాధానాలను గుర్తించి పంపిణీ చేసినట్లు గుర్తించారు.
Read Also:India’s Defence Exports: ఇది భారత్ సత్తా.. ఆల్టైం హైకి రక్షణ ఎగుమతులు..
Also Read
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
పెద్దపల్లిలో తెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్లో డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్న పూల రమేష్ (35)ను సిట్ పట్టుకోవడంతో ఈ సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి. రమేష్ కనీసం మూడు పరీక్షల లీక్ అయిన ప్రశ్న పత్రాలను కాపీ చేశాడు. వాటిలో రెండింటికి సమాధానాలు పొందడానికి ChatGPTని ఉపయోగించాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం జనవరి 22, ఫిబ్రవరి 26న నిర్వహించిన రెండు పరీక్షలకు హాజరైన ఏడుగురు అభ్యర్థులకు సమాధానాలు అందించడానికి రమేష్ భారీ ప్లానే వేశాడు. మొత్తం ఏడుగురు బ్లూటూత్ మైక్రో ఇయర్పీస్లను వారి చెవిలో పెట్టుకుని పరీక్ష హాల్కు హాజరయ్యారు. పరీక్ష ప్రారంభమైన 10 నిమిషాల తర్వాత పరీక్షా కేంద్రంలోని ఎగ్జామినర్ ప్రశ్నపత్రాల ఫోటోలను తీసి రమేష్కు పంపినట్లు భావిస్తున్నారు.
Read Also:Merugu Nagarjuna: మేనిఫెస్టోని అమలు చేసిన ఘనత జగన్ది.. చంద్రబాబులా మాయం చేయలేదు
మరో ప్రదేశంలో తన నలుగురు సహచరులతో కూర్చున్న రమేష్, సరైన సమాధానాలను పొందడానికి చాట్జిపిటిని ఉపయోగించాడు. వాటిని అభ్యర్థులకు ట్రాన్స్ ఫర్ చేశాడు. ఏడుగురిలో ఒక్కొక్కరు ఉత్తీర్ణత సాధించేందుకు రూ.40 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారని ఆరోపించారు. అయితే, మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) పరీక్షకు రమేశ్కు చాట్జీపీటీ ఉపయోగించాల్సిన అవసరం రాలేదు. అంతకు ముందే లీకైన ప్రశ్నపత్రం పూల రవికిషోర్ నుండి ముందుగానే అందింది. లీక్ అయిన ప్రశ్నపత్రాన్ని రమేష్ 30 మందికి పైగా అభ్యర్థులకు ఒక్కొక్కరికి 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయలకు విక్రయించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులతో సహా 35 మందికి పైగా అభ్యర్థుల నుండి 10 కోట్లు సంపాదించాలని రమేష్ ఆశించాడు. మార్చి ప్రారంభంలో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చే సమయానికి అతను దాదాపు రూ.1.1 కోట్లు అందుకున్నాడు. ఆయనను మంగళవారం అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
-
Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
-
Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
-
School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!