Iran: ఇరాన్లో భారీ భూకంపం.. ఏడుగురు మృతి, 440 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Earthquake: ఇరాన్లో భారీ భూకంపం సంభవించింది. అజర్బైజాన్ ప్రావిన్స్లోని ఖోయ్ నగరంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించగా.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అనేక భవనాలు నేలమట్టం కాగా.. 440 మందికి గాయాలయ్యాయి. శిథిలాలు మీద పడి కొందరు మరణించగా.. తప్పించుకునే ప్రయత్నంలో భవనాలపై నుంచి దూకి వందలాది మంది గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో సహాయక సిబ్బంది ప్రజలను రక్షించి వారిని ఆస్పత్రులకు తరలించారు. ఆసుపత్రులకు సమాచారం అందించి, ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పామని ఇరాన్ అత్యవసర సేవల విభాగ అధికారులు వెల్లడించారు.
Bus Accident: లోయలో పడిన బస్సు.. 24 మంది దుర్మరణం
Also Read
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మంచు కురుస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలిసింది. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో బాధితుల ఆర్తనాదాలు చేస్తుండడం కలచివేస్తోంది. గడ్డకట్టే ఉష్ణోగ్రతలు, విద్యుత్ కోతల నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలి సంవత్సరాలలో అనేక విధ్వంసకర భూకంపాలను ఇరాన్ చవిచూసింది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..