‘సూపర్ స్టార్’ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ రాజామౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 29 చేస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. కొన్ని కీలక షెడ్యూల్స్ పూర్తి చేశాడు జక్కన్న. కానీ ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది?, అసలు షూటింగ్ ఎంతవరకు వచ్చింది? అనే విషయంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. కానీ మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 30 ఎవరితో చేయబోతున్నాడనే చర్చ మాత్రం జరుగుతోంది.
ఎస్ఎస్ఎంబీ 29 రిలీజ్ అయ్యాక మహేష్ బాబుకి హాలీవుడ్ రేంజ్ స్టార్ డమ్ రావడం పక్కా. కాబట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ను అంత ఈజీగా తీసుకునే ఛాన్స్ ఉండదు. ఖచ్చితంగా ఎస్ఎస్ఎంబీ 30 అంతకుమించి అనేలా ప్లాన్ చేయడం గ్యారెంటీ. మరి ఆఫర్ట్ ఎస్ఎస్ఎంబీ 29ని, మహేష్ బాబుని హ్యాండిల్ చేసే దర్శకుడు ఎవరంటే.. ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం.. ఇద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్ అయ్యేలా కనిపిస్తున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ను షేక్ చేసి, రాజమౌళి రికార్డ్ బ్రేక్ చేసిన సుకుమార్ మరోసారి మహేష్తో వర్క్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. వన్ నేనొక్కడినే సినిమాతో మహేష్ బాబుకి హిట్ ఇవ్వలేకపోయిన సుకుమార్.. ఈసారి ఆ ఛాన్స్ను వదులుకునేలా లేడు. కాబట్టి.. రాజమౌళి సినిమా తర్వాత సుకుమార్ సినిమా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Also Read: Avatar 2: అవతార్ 2 రిటర్న్స్.. ‘ఫైర్ అండ్ యాష్’ రెడీ!
ఇక సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, మహేష్ బాబుతో సినిమా చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆ మధ్య ఓ స్టోరీ లైన్ కూడా వినిపించినట్టుగా టాక్ వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్తో స్పిరిట్ చేస్తున్న సందీప్.. ఆ తర్వాత రణబీర్ కపూర్తో యానిమల్ పార్క్ చేయనున్నాడు. కాబట్టి ఎస్ఎస్ఎంబీ 30 సందీప్ చేసే ఛాన్స్ లేకపోలేదు. మొత్తంగా.. సుకుమార్, సందీప్ రెడ్డిలలో ఎవరో ఒకరు మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ టేకప్ చేసేలా ఉన్నారనే చెప్పాలి. ఈ ఇద్దరు డైరెక్టర్లు చేసిన చివరి సినిమాలు పాన్ ఇండియా లెవల్లో హిట్ కొట్టాయి. కాబట్టి ఎవరు చేసినా పర్లేదు అని మహేష్ ఫాన్స్ అంటున్నారు.