Srishti Fertility Centre: సృష్టి కేసులో సంచలన విషయాలు.. వారే డాక్టర్ నమ్రత టార్గెట్!
- ముగిసిన డాక్టర్ నమ్రత కస్టడీ విచారణ
- సృష్టి కేసులో సంచలన విషయాలు
- పేదరికంలో ఉన్న భార్యాభర్తలే డాక్టర్ నమ్రత టార్గెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srishti Fertility Centre Surrogacy Scam: సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. సరోగసి పేరిట మోసాలకు పాల్పడుతున్న ఈ కేసులో 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్నటితో డాక్టర్ నమ్రత కస్టడీ విచారణ ముగిసింది. డాక్టర్ నమ్రత చెప్పిన వివరాలను పోలీసులు రికార్డు చేశారు. ఐదు రోజల పాటు విచారించిన పోలీసులు.. ఆమె నుంచి విషయాలను రాబట్టారు. ఇక ఈరోజు A3 కల్యాణి, A6 సంతోషిల కస్టడీ విచారణ ముగియనుంది. కల్యాణి, సంతోషిలు ఏం చెబుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
డాక్టర్ నమ్రత పేదరికంలో మగ్గుతున్న భార్యాభర్తలకు డబ్బులిచ్చి బిడ్డల్ని కొంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కొన్న బిడ్డలను సరోగసి ద్వారా పుట్టారంటూ.. ఫెర్టిలిటీ సెంటర్కు వచ్చే దంపతులకు అప్పగించేది. సృష్టి కేసులో అరెస్ట్ అయిన వారిలో ల్యాబ్ టెక్నిషియన్, డాక్టర్లు, ఏఎన్ఎమ్, ఏజెంట్స్ ఉన్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు.. ఇలా దంపతులకు డాక్టర్ నమ్రత సరోగోసి ఎర వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి.. డెలివరీకి ఉన్న వారి ఆర్థిక స్థోమతలు చూసి ఎర వేసినట్లు దర్యాప్తులో తేలింది. చైల్డ్ ట్రాఫికింగ్ అంశాలపై గోపాలపురం పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతోంది.
Also Read
- Maharashtra: "ఇది కదా విశ్వాసం అంటే".. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
- Steve Waugh Praises Vaibhav Sooryavanshi: బ్రాడ్మన్, గిల్క్రిస్ట్ తర్వాత వైభవ్..? బేబీ బాస్పై ఆస్ట్రేలియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
- Meloni-Trump: ట్రంప్తో సంబంధాలపై మెలోని సంచలన వ్యాఖ్యలు
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
Also Read: MLC Kavitha: ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు.. నిజమైన దీక్షలు చేయాలి!
పిల్లలను ఆమ్మే పలు గ్యాంగులతో డాక్టర్ నమ్రతకు లింకులు ఉన్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు. మహారాష్ట్ర, అహ్మదాబాద్, ఏపీకి చెందిన పలు పిల్లలను దొంగిలించే గ్యాంగులతో నమ్రతకు సంబంధాలు ఉన్నాయి. 3-5 లక్షలు ఇచ్చి గ్యాంగుల నుంచి పిల్లల్ని కొనుగోలు చేసేదని తేలింది. ఐవీఎఫ్ కోసం వచ్చే దంపతులను సరోగసి వైపు మళ్లించి.. భారీగా అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడైంది. తాజాగా ఐదుగురు బాధితులను సరోగసి పేరుతో మోసం చేసి.. వారి నుంచి పెద్ద మొత్తంలో డాక్టర్ నమ్రత డబ్బు వసూలు చేశారని స్పష్టం అయింది. సరోగసి పేరుతో బాధితుల నుంచి ఇటీవల 44 లక్షలు, 18 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు వసూల్ చేసినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Steve Waugh Praises Vaibhav Sooryavanshi: బ్రాడ్మన్, గిల్క్రిస్ట్ తర్వాత వైభవ్..? బేబీ బాస్పై ఆస్ట్రేలియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
-
Meloni-Trump: ట్రంప్తో సంబంధాలపై మెలోని సంచలన వ్యాఖ్యలు
-
Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!