Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Srikakulam Farmers Facing Problems

Srikakulam Farmers Problem: అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి

Published Date :August 8, 2022 , 1:02 pm
By NTV WebDesk
Srikakulam Farmers Problem: అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రకృతి ప్రకోపానికి సిక్కోలు రైతులు కుదేలవుతున్నారు. అతివృష్టి లేకపోతే అనావృష్టి సంభవిస్తూ ప్రతిఏటా ఇబ్బందులు గురౌతున్నారు. వరుస తుఫాన్లు పంటలను తుడిచిపెట్టుకుపోతే సకాలంలో వర్షాలు లేఖ నారు మడులు ఎండిపోతున్నాయి. అధికారుల అలసత్వంతో ప్రతి ఏటా తోటపల్లి రైతులు అవస్దలుపడుతున్నారు.

రాష్ట్రంలో వ్యవసాయాధారిత జిల్లాలో శ్రీకాకుళం జిల్లా ఒకటి. ఈ జిల్లాలో సుమారు 2,39,702 హెక్టార్ల సాగు భూమి ఉంది. ఈ మెత్తం సాగుభూమిలో ఖరీఫ్, రబి రెండు పంటలు పండిస్తున్నప్టటికీ ఖరీఫ్ లో ఎక్కువ శాతం వరి పండిస్తారు. జిల్లా మొత్తం మీద సుమారు 2 లక్షల హెక్టార్లలో వరి పంటను పండిస్తున్నారు. జిల్లాలో వ్యవసాయం అంతా ఎక్కువగా వంశధార,నాగావళి నదులపై ఉన్న ఆనకట్టలపై ఆధారపడి ఉంటుంది.

Also Read

  • Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
  • Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?

కొన్ని మండలాలు మాత్రం వర్షాధారంపై ఆధారపడి ఉన్నాయి. వీటిలో రణస్థలం, లావేరు, సారవకోట, పోలాకి, ఎచ్చెర్లలో కొంతభాగం వర్షాధారం మీద ఆధారపడిన మండలాలు ఉన్నాయి. తోటపల్లి ప్రోజెక్ట్ పై ఆధారపడి ప్రతి ఏటా పంటలు వేయటం అధికారుల నిర్లక్ష్యంతో పాలకొండ , వీరఘట్టాం , రేగిడి మండలాలల్లో సాగునీరు అందటంలేదు.

నైరుతి రుతు పవనాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మెదట్లో వర్షాలు కురవడంతో రైతాంగమంతా వరి సాగుకు పూనుకున్నారు. గతంలో మాదిరి వరినాట్లు వేయకుండా ఎద సాగువైపు మెగ్గు చూపారు. కానీ గత కొన్ని రోజులుగా వరుణుడు ముఖం చాటేసాడు. జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలను నమోదు కావడంతో జిల్లాలోని వరి పంట ఎండిపోతుంది. పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.

కొంతమంది రైతులు బోర్ల ద్వారా వరిపంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తే… మరికొంతమంది ఇంజన్లు ద్వారా వరినాట్లు తడిపి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తోటపల్లి ప్రోజెక్ట్ నీరు అందుబాటులో ఉండి పోలాలకు రాకపోవడం అధికారుల నిర్లక్ష్యం ఉందని ఆరోపిస్తున్నారు రైతులు. ఆధునీకరణ జరగకపోవడం, కొన్ని కాలువలలో అస్సలు పూడికలు తీయకపోవడంతో నీరు పొలాలకు అందటంలేదు.

గతంలో చేసిన అప్పులకు వడ్డీకట్టలేని స్థితిలో రైతాంగం ఉంది. కొన్ని చోట్ల కాలువలు ఉన్నా నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంలో వాటిలో చెత్తా చెదారం చేరిపోయాయి. వీటి పూడిక తీతలకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో పంటలు నాశనమవుతున్నాయి. తోటపల్లి ఓల్డ్ రెగ్యూలేటర్ పనులు ప్రారంభమయినా అక్కడ కూడా అదే పరిస్థితి దీనితో నీళ్ళు ఉండి పంటను కాపాడుకోలేని పరిస్థితి ఉంది.

ఓ వైపు అధికారుల నిర్లక్ష్యం . ప్రకృతి ప్రకోపం వెరసి అన్నదాత ఆగమౌతున్నాడు . వరుణుడు కరుణ లేఖ దీనంగా ఆకాశం వైపు ఎదురు చూస్తున్నాడు. వ్యవసాయం చేయాలంటే భయంగా ఉందని ఊరు వదిలి వెళ్ళలేక పెట్టుబడులు పెడుతున్నామని చెబుతున్నారు. తోటపల్లిని ఆధునీకరించి నాలుగు ముద్దలు నోట్లోకి వెళ్ళేలా అధికారులు , పాలకులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cultivations
  • draught
  • farmers problems
  • Floods
  • srikakulam

తాజావార్తలు

  • Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ‘గిరిదర్శక్’గా ఉద్యోగాలు!

  • Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • Ashu Reddy Scam: డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంది!

  • The Paradise: ‘ఆయా షేర్’ తర్వాత అనిరుధ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్.. ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌కి డేట్ ఫిక్స్!

ట్రెండింగ్‌

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions