Srikakulam Farmers Problem: అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకృతి ప్రకోపానికి సిక్కోలు రైతులు కుదేలవుతున్నారు. అతివృష్టి లేకపోతే అనావృష్టి సంభవిస్తూ ప్రతిఏటా ఇబ్బందులు గురౌతున్నారు. వరుస తుఫాన్లు పంటలను తుడిచిపెట్టుకుపోతే సకాలంలో వర్షాలు లేఖ నారు మడులు ఎండిపోతున్నాయి. అధికారుల అలసత్వంతో ప్రతి ఏటా తోటపల్లి రైతులు అవస్దలుపడుతున్నారు.
రాష్ట్రంలో వ్యవసాయాధారిత జిల్లాలో శ్రీకాకుళం జిల్లా ఒకటి. ఈ జిల్లాలో సుమారు 2,39,702 హెక్టార్ల సాగు భూమి ఉంది. ఈ మెత్తం సాగుభూమిలో ఖరీఫ్, రబి రెండు పంటలు పండిస్తున్నప్టటికీ ఖరీఫ్ లో ఎక్కువ శాతం వరి పండిస్తారు. జిల్లా మొత్తం మీద సుమారు 2 లక్షల హెక్టార్లలో వరి పంటను పండిస్తున్నారు. జిల్లాలో వ్యవసాయం అంతా ఎక్కువగా వంశధార,నాగావళి నదులపై ఉన్న ఆనకట్టలపై ఆధారపడి ఉంటుంది.
Also Read
- Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
- Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
- Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
- Discount On Mobile: తొలి సేల్లో రూ.10,000 తక్కువ ధరకు లభిస్తున్న మోటో 'లగ్జరీ' ఫోన్.. రేపు అందుబాటులోకి..
కొన్ని మండలాలు మాత్రం వర్షాధారంపై ఆధారపడి ఉన్నాయి. వీటిలో రణస్థలం, లావేరు, సారవకోట, పోలాకి, ఎచ్చెర్లలో కొంతభాగం వర్షాధారం మీద ఆధారపడిన మండలాలు ఉన్నాయి. తోటపల్లి ప్రోజెక్ట్ పై ఆధారపడి ప్రతి ఏటా పంటలు వేయటం అధికారుల నిర్లక్ష్యంతో పాలకొండ , వీరఘట్టాం , రేగిడి మండలాలల్లో సాగునీరు అందటంలేదు.
నైరుతి రుతు పవనాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మెదట్లో వర్షాలు కురవడంతో రైతాంగమంతా వరి సాగుకు పూనుకున్నారు. గతంలో మాదిరి వరినాట్లు వేయకుండా ఎద సాగువైపు మెగ్గు చూపారు. కానీ గత కొన్ని రోజులుగా వరుణుడు ముఖం చాటేసాడు. జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలను నమోదు కావడంతో జిల్లాలోని వరి పంట ఎండిపోతుంది. పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.
కొంతమంది రైతులు బోర్ల ద్వారా వరిపంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తే… మరికొంతమంది ఇంజన్లు ద్వారా వరినాట్లు తడిపి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తోటపల్లి ప్రోజెక్ట్ నీరు అందుబాటులో ఉండి పోలాలకు రాకపోవడం అధికారుల నిర్లక్ష్యం ఉందని ఆరోపిస్తున్నారు రైతులు. ఆధునీకరణ జరగకపోవడం, కొన్ని కాలువలలో అస్సలు పూడికలు తీయకపోవడంతో నీరు పొలాలకు అందటంలేదు.
గతంలో చేసిన అప్పులకు వడ్డీకట్టలేని స్థితిలో రైతాంగం ఉంది. కొన్ని చోట్ల కాలువలు ఉన్నా నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంలో వాటిలో చెత్తా చెదారం చేరిపోయాయి. వీటి పూడిక తీతలకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో పంటలు నాశనమవుతున్నాయి. తోటపల్లి ఓల్డ్ రెగ్యూలేటర్ పనులు ప్రారంభమయినా అక్కడ కూడా అదే పరిస్థితి దీనితో నీళ్ళు ఉండి పంటను కాపాడుకోలేని పరిస్థితి ఉంది.
ఓ వైపు అధికారుల నిర్లక్ష్యం . ప్రకృతి ప్రకోపం వెరసి అన్నదాత ఆగమౌతున్నాడు . వరుణుడు కరుణ లేఖ దీనంగా ఆకాశం వైపు ఎదురు చూస్తున్నాడు. వ్యవసాయం చేయాలంటే భయంగా ఉందని ఊరు వదిలి వెళ్ళలేక పెట్టుబడులు పెడుతున్నామని చెబుతున్నారు. తోటపల్లిని ఆధునీకరించి నాలుగు ముద్దలు నోట్లోకి వెళ్ళేలా అధికారులు , పాలకులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!