Srikakulam Farmers Problem: అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకృతి ప్రకోపానికి సిక్కోలు రైతులు కుదేలవుతున్నారు. అతివృష్టి లేకపోతే అనావృష్టి సంభవిస్తూ ప్రతిఏటా ఇబ్బందులు గురౌతున్నారు. వరుస తుఫాన్లు పంటలను తుడిచిపెట్టుకుపోతే సకాలంలో వర్షాలు లేఖ నారు మడులు ఎండిపోతున్నాయి. అధికారుల అలసత్వంతో ప్రతి ఏటా తోటపల్లి రైతులు అవస్దలుపడుతున్నారు.
రాష్ట్రంలో వ్యవసాయాధారిత జిల్లాలో శ్రీకాకుళం జిల్లా ఒకటి. ఈ జిల్లాలో సుమారు 2,39,702 హెక్టార్ల సాగు భూమి ఉంది. ఈ మెత్తం సాగుభూమిలో ఖరీఫ్, రబి రెండు పంటలు పండిస్తున్నప్టటికీ ఖరీఫ్ లో ఎక్కువ శాతం వరి పండిస్తారు. జిల్లా మొత్తం మీద సుమారు 2 లక్షల హెక్టార్లలో వరి పంటను పండిస్తున్నారు. జిల్లాలో వ్యవసాయం అంతా ఎక్కువగా వంశధార,నాగావళి నదులపై ఉన్న ఆనకట్టలపై ఆధారపడి ఉంటుంది.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
కొన్ని మండలాలు మాత్రం వర్షాధారంపై ఆధారపడి ఉన్నాయి. వీటిలో రణస్థలం, లావేరు, సారవకోట, పోలాకి, ఎచ్చెర్లలో కొంతభాగం వర్షాధారం మీద ఆధారపడిన మండలాలు ఉన్నాయి. తోటపల్లి ప్రోజెక్ట్ పై ఆధారపడి ప్రతి ఏటా పంటలు వేయటం అధికారుల నిర్లక్ష్యంతో పాలకొండ , వీరఘట్టాం , రేగిడి మండలాలల్లో సాగునీరు అందటంలేదు.
నైరుతి రుతు పవనాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మెదట్లో వర్షాలు కురవడంతో రైతాంగమంతా వరి సాగుకు పూనుకున్నారు. గతంలో మాదిరి వరినాట్లు వేయకుండా ఎద సాగువైపు మెగ్గు చూపారు. కానీ గత కొన్ని రోజులుగా వరుణుడు ముఖం చాటేసాడు. జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలను నమోదు కావడంతో జిల్లాలోని వరి పంట ఎండిపోతుంది. పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.
కొంతమంది రైతులు బోర్ల ద్వారా వరిపంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తే… మరికొంతమంది ఇంజన్లు ద్వారా వరినాట్లు తడిపి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తోటపల్లి ప్రోజెక్ట్ నీరు అందుబాటులో ఉండి పోలాలకు రాకపోవడం అధికారుల నిర్లక్ష్యం ఉందని ఆరోపిస్తున్నారు రైతులు. ఆధునీకరణ జరగకపోవడం, కొన్ని కాలువలలో అస్సలు పూడికలు తీయకపోవడంతో నీరు పొలాలకు అందటంలేదు.
గతంలో చేసిన అప్పులకు వడ్డీకట్టలేని స్థితిలో రైతాంగం ఉంది. కొన్ని చోట్ల కాలువలు ఉన్నా నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంలో వాటిలో చెత్తా చెదారం చేరిపోయాయి. వీటి పూడిక తీతలకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో పంటలు నాశనమవుతున్నాయి. తోటపల్లి ఓల్డ్ రెగ్యూలేటర్ పనులు ప్రారంభమయినా అక్కడ కూడా అదే పరిస్థితి దీనితో నీళ్ళు ఉండి పంటను కాపాడుకోలేని పరిస్థితి ఉంది.
ఓ వైపు అధికారుల నిర్లక్ష్యం . ప్రకృతి ప్రకోపం వెరసి అన్నదాత ఆగమౌతున్నాడు . వరుణుడు కరుణ లేఖ దీనంగా ఆకాశం వైపు ఎదురు చూస్తున్నాడు. వ్యవసాయం చేయాలంటే భయంగా ఉందని ఊరు వదిలి వెళ్ళలేక పెట్టుబడులు పెడుతున్నామని చెబుతున్నారు. తోటపల్లిని ఆధునీకరించి నాలుగు ముద్దలు నోట్లోకి వెళ్ళేలా అధికారులు , పాలకులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..