SL vs ENG: పదేళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై శ్రీలంక విజయం..
- పదేళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై శ్రీలంక క్రికెట్ జట్టు గెలుపు
- పాతుమ్ నిస్సాంక సెంచరీ సాధించడంతో శ్రీలంక విజయం
- ఇంగ్లండ్-శ్రీలంక జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్
- చివరి మ్యాచ్ లో శ్రీలంక విక్టరీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పదేళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై శ్రీలంక క్రికెట్ జట్టు గెలుపొందింది. పాతుమ్ నిస్సాంక సెంచరీ సాధించడంతో శ్రీలంక ఈ ఘనత సాధించింది. ఇంగ్లండ్-శ్రీలంక జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ జరుగుతుంది. అందులో భాగంగా లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో మూడో, చివరి మ్యాచ్ జరిగింది. ఈ సిరీస్లో 0-2తో వెనుకబడిన శ్రీలంక.. చివరి టెస్టులో పుంజుకుని 8 వికెట్ల తేడాతో ఇంగ్లీష్ జట్టును ఓడించింది. శ్రీలంక టీమ్లో 127 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన నిస్సాంక.. శ్రీలంక సాధించిన ఈ చారిత్రాత్మక విజయానికి హీరో. అతనికి తోడు.. 32 పరుగులు చేసి చివరి వరకు నాటౌట్గా ఉన్న ఏంజెలో మాథ్యూస్ కూడా జట్టు విజయంలో పాత్ర పోషించాడు. వీరిద్దరి మధ్య మూడో వికెట్కు 111 పరుగుల అజేయ భాగస్వామ్యం ఉంది. చివరిసారిగా 2014లో ఇంగ్లండ్లో జరిగిన మ్యాచ్లో శ్రీలంక గెలిచింది.
Read Also: Manipur voilance: మణిపూర్లో స్టూడెంట్స్ ఆందోళన.. గవర్నర్ రిజైన్ చేయాలని డిమాండ్
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
మూడో టెస్టు మ్యాచ్లో శ్రీలంకకు 219 పరుగుల విజయ లక్ష్యం ఉంది. 220 పరుగుల టార్గెట్ లో 127 పరుగులు చేసి శ్రీలంక విజయానికి పాతుమ్ నిస్సంక హీరోగా నిలిచాడు. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 325 పరుగులు చేసింది. కెప్టెన్ ఒలీ పోప్ (154) పరుగులతో రాణించాడు. శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులకే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్లో 62 పరుగుల తేడాతో వెనుకంజలో ఉన్న శ్రీలంక.. ఈ మ్యాచ్లో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ను 156 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ క్రమంలో.. 220 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. పాతుమ్ నిస్సాంక అజేయ సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో.. ఇంగ్లండ్ 2-1తో సిరీస్ని కైవసం చేసుకుంది.
Read Also: Breathlessness: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా.. వీటికి సంకేతం..!
తాజావార్తలు
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
-
Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
-
Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్కు త్రిషా కృష్ణన్.. విజయ్తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్లో చర్చ
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!