SL vs ENG: పదేళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై శ్రీలంక విజయం..
- పదేళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై శ్రీలంక క్రికెట్ జట్టు గెలుపు
- పాతుమ్ నిస్సాంక సెంచరీ సాధించడంతో శ్రీలంక విజయం
- ఇంగ్లండ్-శ్రీలంక జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్
- చివరి మ్యాచ్ లో శ్రీలంక విక్టరీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పదేళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై శ్రీలంక క్రికెట్ జట్టు గెలుపొందింది. పాతుమ్ నిస్సాంక సెంచరీ సాధించడంతో శ్రీలంక ఈ ఘనత సాధించింది. ఇంగ్లండ్-శ్రీలంక జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ జరుగుతుంది. అందులో భాగంగా లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో మూడో, చివరి మ్యాచ్ జరిగింది. ఈ సిరీస్లో 0-2తో వెనుకబడిన శ్రీలంక.. చివరి టెస్టులో పుంజుకుని 8 వికెట్ల తేడాతో ఇంగ్లీష్ జట్టును ఓడించింది. శ్రీలంక టీమ్లో 127 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన నిస్సాంక.. శ్రీలంక సాధించిన ఈ చారిత్రాత్మక విజయానికి హీరో. అతనికి తోడు.. 32 పరుగులు చేసి చివరి వరకు నాటౌట్గా ఉన్న ఏంజెలో మాథ్యూస్ కూడా జట్టు విజయంలో పాత్ర పోషించాడు. వీరిద్దరి మధ్య మూడో వికెట్కు 111 పరుగుల అజేయ భాగస్వామ్యం ఉంది. చివరిసారిగా 2014లో ఇంగ్లండ్లో జరిగిన మ్యాచ్లో శ్రీలంక గెలిచింది.
Read Also: Manipur voilance: మణిపూర్లో స్టూడెంట్స్ ఆందోళన.. గవర్నర్ రిజైన్ చేయాలని డిమాండ్
Also Read
మూడో టెస్టు మ్యాచ్లో శ్రీలంకకు 219 పరుగుల విజయ లక్ష్యం ఉంది. 220 పరుగుల టార్గెట్ లో 127 పరుగులు చేసి శ్రీలంక విజయానికి పాతుమ్ నిస్సంక హీరోగా నిలిచాడు. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 325 పరుగులు చేసింది. కెప్టెన్ ఒలీ పోప్ (154) పరుగులతో రాణించాడు. శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులకే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్లో 62 పరుగుల తేడాతో వెనుకంజలో ఉన్న శ్రీలంక.. ఈ మ్యాచ్లో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ను 156 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ క్రమంలో.. 220 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. పాతుమ్ నిస్సాంక అజేయ సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో.. ఇంగ్లండ్ 2-1తో సిరీస్ని కైవసం చేసుకుంది.
Read Also: Breathlessness: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా.. వీటికి సంకేతం..!
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!