Kadiyapulanka Flowers: కడియపులంకకు శ్రావణ మాస శోభ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆషాఢ మాసం అయిపోయింది.. శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసం అంటే మహిళలకు ఎంతో ఇష్టమయిన మాసం. ఈ మాసం అంతా పవిత్రమైన మాసంగానే స్త్రీలు భావిస్తారు. స్త్రీలు దోసిట్లో సెనగల మూట, కాళ్ళకు పసుపు రాసుకుంటారు. తలలో వివిధ రకాల పూలు ధరించడం, చేతులకు తోరణాలు, కొత్త చీరలు, పట్టుచీరలతో ప్రకృతి అంతా శోభాయమానంగా అలరారుతుంది. ఏ ఇంట చూసినా పండుగ వాతావరణమే కనబడుతుంది.
పూజలు, వ్రతాలకు కేరాఫ్ అడ్రస్ ఈ శ్రావణం. కొత్తగా పెళ్ళయిన వారు పుట్టింట్లో వివిధ రకాల పూజలు చేస్తారు. ఆషాఢంలో అత్తారింటికి దూరంగా వుంటారు. శ్రావణ శుక్రవారం పూజలు చేసి అత్తారింటికి వెళతారు. వరదలు కారణం గా పూల తోటలు కు భారీ నష్టం వాటిల్లింది. మార్కెట్ లో దేశవాళీ పూల కొరతతో ధరలు ఆకాశాన్నంటాయి. దేశవ్యాప్తంగా కడియపులంక పూల మార్కెట్ నుంచి భారీగా ఎగుమతులు జరుగుతుంటాయి.
Also Read
- Tawa Paneer Tikka Recipe: ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ 'తవా పనీర్ టిక్కా'.. సీక్రెట్ రెసిపీ మీకోసం!
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
- Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్లో మెసేజ్ పంపొచ్చు!
కడియపు లంక చుట్టుపక్కల గ్రామాలలో 600కు పైగా నర్సరీలు దేశంలోనే ప్రసిద్ధి గాంచాయి. ఇక్కడి పూల మార్కెట్ నుండి తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు పూల సరఫరా జరుగుతుంది. ఈ మార్కెట్లో హోల్సేల్ దుకాణాలు వంద వరకూ వుంటాయి.రెండవ శుక్రవారం అంటే పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీవ్రతం చేస్తారు. ఈ వ్రతం కోసం పూలు, పండ్లు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. శ్రావణమాసంలో వచ్చే ప్రతీ రోజు విశేషమైనదిగానే చెప్పుకోవచ్చు. ఈ శ్రావణమాసం శివకేశవులకు అభేదం లేదు అని తెలియజేస్తుంది. ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. పూల దుకాణాలు కళకళలాడుతుంటాయి.
తూర్పుగోదావరి జిల్లాలోని కడియపు లంక పూల మార్కెట్ సందడిగా మారింది. కడియపులంక శ్రావణ శోభతో అలరారుతోంది. ఒకవైపు గోదావరి వరద, ఎడతెరిపి లేని వర్షాలతో కడియపులంకలో పూల దిగుబడి గణనీయంగా తగ్గింది. తొలి శ్రావణ శుక్రవారం, పెళ్లిళ్లు సీజన్ స్టార్ట్ కావడంతో పూలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ధరలు భారీగా పెరిగాయి. గతంలో చామంతి కేజీ రూ.200 పలకగా బంతి రూ.వంద, లిల్లీ రూ.400, మల్లెపూలు రూ.1400, గులాబీ రూ.200, కనకాంబరం బారు రూ.300 కి మించి పలుకుతున్నాయి. స్థానికంగా లభ్యమయ్యే పూలు కంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అలంకరణ పూలను ప్రస్తుతం అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

తాజావార్తలు
-
Tawa Paneer Tikka Recipe: ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ ‘తవా పనీర్ టిక్కా’.. సీక్రెట్ రెసిపీ మీకోసం!
-
CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
-
Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
-
Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్లో మెసేజ్ పంపొచ్చు!
-
Virat Kohli: “జట్టుకు పనికొస్తానో లేదో నా ముఖం మీద చెప్పేయండి”.. గంభీర్, అగార్కర్పై కోహ్లీ ఫైర్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..