IND vs NZ 4th T20: అలా కొట్టేసారు ఏంటి కివిస్ మామలు.. భారత్ టార్గెట్ ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs NZ 4th T20: విశాఖపట్నంలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న భారత్, న్యూజిలాండ్ నాలుగో టీ20 మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. ఫస్ట్ బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. టిమ్ సీఫెర్ట్ – డెవాన్ కాన్వే జంట న్యూజిలాండ్కు శుభారంభాన్ని అందించారు. న్యూజిలాండ్ తరపున టిమ్ సీఫెర్ట్ 36 బంతుల్లో 62 పరుగులు చేయగా, కాన్వే 44 పరుగులు చేశాడు. చివరి ఓవర్లలో డారిల్ మిచెల్ 18 బంతుల్లో 39 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ జట్టు స్కోర్ 215 కి చేరుకుంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2, అర్ష్దీప్ సింగ్ 2, బుమ్రా, రవి బిష్ణోయ్ ఒక్కో వికెట్ తీశారు. నిర్ణీత 20 ఓవర్లలో ఇండియా టార్గెట్ 216 పరుగులు.
Also Read
- SIR Draft Voter List: తెలంగాణలో నేడు ముసాయిదా ఓటర్ జాబితా విడుదల.. 73.39 లక్షల పేర్ల తొలగింపు.!
- Rainbow Children's Hospital: రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!
- iQOO 16లో అదిరిపోయే అప్గ్రేడ్స్.. 165Hz డిస్ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..
- Rajahmundry Tragedy: రాజమహేంద్రవరంలో విషాదం.. గోదావరిలోకి దూకిన ఏఈ కుటుంబం, ముగ్గురు గల్లంతు!
ఈ మ్యాచ్లో న్యూజిలాండ్కు తుఫాను ఆరంభం లభించింది. కివీస్ ఓపెనింగ్ జోడీ టిమ్ సీఫెర్ట్ – డెవాన్ కాన్వే కలిసి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. భారత్పై న్యూజిలాండ్ తరపున టిమ్ సీఫెర్ట్ అత్యంత వేగవంతమైన టీ20 హాఫ్ సెంచరీ రికార్డును సమం చేశాడు. డెవాన్ కాన్వేతో పాటు, గత తొమ్మిదేళ్లలో చూడని ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్లో టిమ్ సీఫెర్ట్ అద్భుతమైన అర్ధ సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. విశాఖపట్నంలో సీఫెర్ట్ కేవలం 25 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. ఇది భారత్పై న్యూజిలాండ్ బ్యాట్స్మన్ చేసిన వేగవంతమైన అర్ధ సెంచరీ. 2020లో ఆక్లాండ్లో కేవలం 25 బంతుల్లోనే 50 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ల సరసన నిలిచాడు. ఈ మ్యాచ్లో సీఫెర్ట్ 200కి దగ్గరగా స్ట్రైక్ రేట్ను కొనసాగించాడు. 2020 తర్వాత న్యూజిలాండ్ భారత్తో జరిగిన 17 T20I లలో 50+ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ఇదే తొలిసారి.
ఈ మ్యాచ్లో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్కు ఇషాన్ కిషన్ దూరమయ్యాడు. ఇషాన్ ప్లేస్లో అర్ష్దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. మూడో టీ20లో ఇషాన్ కిషన్ గాయపడ్డాడని, దీంతో నాలుగవ టీ20 నుంచి తప్పుకున్నాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు.
READ ALSO: jewellery: నగలను పింక్ పేపర్లోనే ఎందుకు చుడతారో తెలుసా?
తాజావార్తలు
-
SIR Draft Voter List: తెలంగాణలో నేడు ముసాయిదా ఓటర్ జాబితా విడుదల.. 73.39 లక్షల పేర్ల తొలగింపు.!
-
Rainbow Children’s Hospital: రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో కూడా..!
-
West Bengal Hotel Fire: బీర్భూమ్లో ఘోర అగ్నిప్రమాదం.. హోటల్లో ఏడుగురు సజీవ దహనం
-
Buchi Babu Sana: రవి తేజ కోసమే తొలి కథ రాశా.. ‘ఇరుముడి’ ఈవెంట్లో బుచ్చిబాబు సానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
iQOO 16లో అదిరిపోయే అప్గ్రేడ్స్.. 165Hz డిస్ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?