IND vs NZ 4th T20: అలా కొట్టేసారు ఏంటి కివిస్ మామలు.. భారత్ టార్గెట్ ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs NZ 4th T20: విశాఖపట్నంలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న భారత్, న్యూజిలాండ్ నాలుగో టీ20 మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. ఫస్ట్ బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. టిమ్ సీఫెర్ట్ – డెవాన్ కాన్వే జంట న్యూజిలాండ్కు శుభారంభాన్ని అందించారు. న్యూజిలాండ్ తరపున టిమ్ సీఫెర్ట్ 36 బంతుల్లో 62 పరుగులు చేయగా, కాన్వే 44 పరుగులు చేశాడు. చివరి ఓవర్లలో డారిల్ మిచెల్ 18 బంతుల్లో 39 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ జట్టు స్కోర్ 215 కి చేరుకుంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2, అర్ష్దీప్ సింగ్ 2, బుమ్రా, రవి బిష్ణోయ్ ఒక్కో వికెట్ తీశారు. నిర్ణీత 20 ఓవర్లలో ఇండియా టార్గెట్ 216 పరుగులు.
Also Read
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
- Vaibhav Century Miss: మరోసారి సెంచరీ మిస్ చేసుకున్న సూర్యవంశీ.. చెత్త రికార్డులో కూడా నంబర్ వన్గా వైభవ్..
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
ఈ మ్యాచ్లో న్యూజిలాండ్కు తుఫాను ఆరంభం లభించింది. కివీస్ ఓపెనింగ్ జోడీ టిమ్ సీఫెర్ట్ – డెవాన్ కాన్వే కలిసి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. భారత్పై న్యూజిలాండ్ తరపున టిమ్ సీఫెర్ట్ అత్యంత వేగవంతమైన టీ20 హాఫ్ సెంచరీ రికార్డును సమం చేశాడు. డెవాన్ కాన్వేతో పాటు, గత తొమ్మిదేళ్లలో చూడని ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్లో టిమ్ సీఫెర్ట్ అద్భుతమైన అర్ధ సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. విశాఖపట్నంలో సీఫెర్ట్ కేవలం 25 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. ఇది భారత్పై న్యూజిలాండ్ బ్యాట్స్మన్ చేసిన వేగవంతమైన అర్ధ సెంచరీ. 2020లో ఆక్లాండ్లో కేవలం 25 బంతుల్లోనే 50 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ల సరసన నిలిచాడు. ఈ మ్యాచ్లో సీఫెర్ట్ 200కి దగ్గరగా స్ట్రైక్ రేట్ను కొనసాగించాడు. 2020 తర్వాత న్యూజిలాండ్ భారత్తో జరిగిన 17 T20I లలో 50+ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ఇదే తొలిసారి.
ఈ మ్యాచ్లో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్కు ఇషాన్ కిషన్ దూరమయ్యాడు. ఇషాన్ ప్లేస్లో అర్ష్దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. మూడో టీ20లో ఇషాన్ కిషన్ గాయపడ్డాడని, దీంతో నాలుగవ టీ20 నుంచి తప్పుకున్నాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు.
READ ALSO: jewellery: నగలను పింక్ పేపర్లోనే ఎందుకు చుడతారో తెలుసా?
తాజావార్తలు
-
Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
-
Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
-
Smartphone Prices Hike: స్మార్ట్ఫోన్ ప్రియులకు షాక్.. చుక్కలు చూపిస్తున్న ధరలు! పండగ సీజన్లో కొత్త ఫోన్ల కొనుగోళ్లు డౌటే..
-
CM Revanth Reddy : ‘ఒక్క ఓటు కూడా డిలీట్ కావొద్దు’.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అలర్ట్.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
ట్రెండింగ్
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?