Bengaluru: డీకే శివకుమార్పై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్పై కేసు నమోదు చేయాలని పోలీసులకు ప్రత్యేక కోర్టు ఆదేశించింది. బీజేపీ నేతల నిరసన చిత్రాన్ని మార్ఫింగ్ చేసినందుకు డీకే శివకుమార్తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర ఐటీసెల్ హెడ్ బీఆర్ నాయుడుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ప్రత్యేక కోర్టు ఆదేశించింది.
1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఆందోళనలో పాల్గొన్న కరసేవక్ శ్రీకాంత్ పూజారిని పోలీసులు ఇటీవల అరెస్టు చేసినందుకు వ్యతిరేకంగా కమలనాథులు నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా ఆందోళనకారులు ‘నేను కూడా కరసేవక్నే.. నన్ను కూడా అరెస్టు చేయండి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
Also Read
- Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
- 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
- 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
- Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
అయితే ఈ ప్లకార్డులను కాంగ్రెస్ మరో రకంగా మార్చి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మోసాలు, ఇతర అక్రమాలు మేమే చేశాం అనే అర్థం వచ్చేలా మార్ఫింగ్ చేసి కాంగ్రెస్ ఐటీ సెల్ పోస్ట్ చేసింది. ఇదే పోస్టులను డీకే.శివకుమార్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కాంగ్రెస్ రాసిన రాతలపై కాషాయ పార్టీ నేతలు గరం గరం అయ్యారు. బీజేపీ నాయకులను అవమానపరిచేలా దీనిని కాంగ్రెస్ నేతలు మార్చారని పేర్కొంటూ బీజేపీ లీగల్ సెల్ ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేసింది. దీంతో చిత్రాన్ని మార్ఫింగ్ చేసినవారిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.
ఇదిలా ఉంటే కర్ణాటక రాష్ట్రం పట్ల కేంద్రం అన్యాయం చేస్తోదంటూ ఢిల్లీ వేదికగా జంతర్మంతర్ దగ్గర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. కేంద్రం తీరుకు నిరసనగా ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ కూడా ఢిల్లీ, కర్ణాటకలో నిరసనలు చేపట్టారు. ఇలా రెండు జాతీయ పార్టీల నేతలు బుధవారం కర్ణాటక రాజకీయాలను హీటెక్కించారు.
తాజావార్తలు
-
Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ‘గిరిదర్శక్’గా ఉద్యోగాలు!
-
Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
Ashu Reddy Scam: డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంది!
-
The Paradise: ‘ఆయా షేర్’ తర్వాత అనిరుధ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్.. ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్కి డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!