Murali Mohan : లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చింది: పద్మశ్రీపై మురళీ మోహన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాగంటి మురళీ మోహన్ ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సందేశాత్మక చిత్రాలను అందించారు. ‘జగమే మాయ’ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన మురళీ మోహన్, క్రమశిక్షణ గల నటుడిగా పేరు తెచ్చుకుని 350కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన ప్రస్థానం ఎందరికో ఆదర్శం. మురళీ మోహన్ కేవలం హీరోగానే కాకుండా సహాయ నటుడిగా, విలన్గా కూడా రాణించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. నిర్మాతగా ఆయన స్థాపించిన జయభేరి ఆర్ట్స్ బ్యానర్ టాలీవుడ్లో ఎన్నో క్లాసిక్ సినిమాలకు వేదికైంది.రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత కూడా ఆయన సేవా దృక్పథం కొనసాగింది. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ ఎంపీగా గెలిచిన మురళీ మోహన్, తన నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. విద్య, వైద్య రంగాల్లో ఆయన చేసిన సామాజిక సేవలు ఎందరికో మేలు చేకూర్చాయి. మాగంటి మురళీ మోహన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేలాది మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడం ఆయన మానవతా దృక్పథానికి నిదర్శనం. రాజకీయాల్లో ఉన్నా సినిమా రంగాన్ని ఆయన ఎన్నడూ మర్చిపోలేదు. సుదీర్ఘ కాలంగా పద్మ పురస్కారాల కోసం ఆయన పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ, 2026లో ఈ గౌరవం దక్కడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు
Also Read : LokeshKanagaraj : ఖైదీ 2 వాయిదా వెనక స్టోరీ ఏంటో చెప్పిన లోకేష్ కనకరాజ్
Also Read
- కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్తో ASUS Pad (T3201) భారత్లో లాంచ్..!
- KCR: ‘నమ్మకమైన ఉద్యమ సహచరుడిని కోల్పోయా’.. సుదర్శన్రెడ్డి మృతిపై కేసీఆర్ భావోద్వేగం!
- Peddi Sudarshan Reddy: కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన ఉద్యమ నాయకుడు.. పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే..
- Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు.. చికిత్స పొందుతూ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
తాజాగా గణతంత్ర దినోత్సవ వేళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తనకు పద్మశ్రీ పురస్కారం దక్కడంపై సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్ హర్షం వ్యక్తం చేశారు.‘‘అందరికీ నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన పద్మ అవార్డు నిన్న సాయంత్రం ప్రకటించినప్పటి నుంచి అనేక మంది మిత్రులు, శ్రేయోభిలాషులు ఫోన్ చేశారు. ‘మీకు ఎప్పుడో రావాల్సింది.. ఇప్పుడైనా వచ్చింది’ అని అంటుంటే.. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చింది అని చెప్పాను. అన్నీ మనం అనుకున్నప్పుడే రావు. ఏదైనా ఎదురు చూపుల తర్వాత దొరికితే దాని విలువ ఎక్కువ. మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. ఇంత మంచి అవార్డును ఇచ్చిన ప్రధాని నరేంద్రమోదీగారికి,ఏపీ సీఎం చంద్రబాబు గారికి, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి గారికి, చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులందరికీ కృతజ్జతలు. అవార్డు అందుకున్న తర్వాత వివరంగా ప్రెస్మీట్ పెట్టి చెబుతాను. థ్యాంక్యూ’’ అంటూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
తాజావార్తలు
-
Nokia 100 (2026): నోకియా 100 విడుదలకు ముందే లీక్.. LED ఫ్లాష్లైట్, 1,020mAh బ్యాటరీతో కొత్త ఫీచర్ ఫోన్!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్తో ASUS Pad (T3201) భారత్లో లాంచ్..!
-
IAM GAME Trailer : దుల్కర్ సల్మాన్ ‘IAM GAME’ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసిన యంగ్ టైగర్
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మ్యాక్స్ రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP సెల్ఫీ కెమెరా, 10,000mAh బ్యాటరీ!
-
KCR: ‘నమ్మకమైన ఉద్యమ సహచరుడిని కోల్పోయా’.. సుదర్శన్రెడ్డి మృతిపై కేసీఆర్ భావోద్వేగం!
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!