South Central Railway: పండుగల సీజన్.. రైళ్ల రాకపోకలపై దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Central Railway: దీపావళి/ఛత్ పూజా సీజన్లో, రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం మరియు ప్రయాణీకుల అదనపు రద్దీని అధిగమించడానికి దక్షిణ మధ్య రైల్వే సాధారణ, రోజువారీ ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లతో పాటు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. రైలు ప్రయాణీకుల ప్రయోజనం కోసం జోన్లోనే కాకుండా జోన్ వెలుపలి గమ్యస్థానాలకు కూడా ప్రత్యేక రైళ్లు నడపబడుతున్నాయి. భారతీయ రైల్వేలలో, సాధారణ రైళ్లకు అదనంగా పండుగ ప్రత్యేక రైళ్లలో సుమారు 26 లక్షల అదనపు బెర్త్లతో ప్రయాణికులకు కల్పించడం జరిగింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఈ సమయంలో రైళ్లను సకాలంలో నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ కాలంలో రైళ్లు సమయానికి గమ్యస్థానం చేరుకునేలా అన్ని స్థాయిలలో – స్టేషన్, డివిజన్లు, జోన్లలో రైళ్ల కోసం నిరంతర పర్యవేక్షణ జరుగుతోంది.
Also Read: Manda Krishna Madiga: మోడీ గారు.. మీరు ఎస్సీ వర్గీకరణ చేయండి..
Also Read
రైళ్లు ప్రారంభమయ్యే అన్ని ప్రధాన యార్డులలో, నిర్వహణ పనులను సకాలంలో పూర్తి చేయడం , రైళ్లను సకాలంలో ప్రారంభించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. రైళ్లను సమయానికి నడపడానికి అన్ని డివిజన్లలో విభాగాల మధ్య నిరంతరం సమన్వయం జరుగుతుంది. ఈ రద్దీ సీజన్లో తమ రైళ్లు సమయపాలన పాటించేలా చూసేందుకు ఇంటర్-జోనల్ రైళ్లకు ఇదే విధమైన శ్రద్ధ వహిస్తున్నారు. ప్రయాణీకుల ప్రయాణ అవసరాలను తీర్చడానికి, దక్షిణ మధ్య రైల్వే మాదిరిగానే, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న అన్ని జోనల్ రైల్వేలు ప్రత్యేక ట్రిప్పులను నడపడానికి సన్నద్ధమయ్యాయి. ఈ ప్రత్యేక రైళ్ల ద్వారా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి వివిధ రాష్ట్రాల నుంచి కనెక్టివిటీని నిర్ధారిస్తున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు అన్ని ప్రధాన స్టేషన్లలో స్టాపేజ్ సౌకర్యాన్ని అందిస్తాయి, ఇవి ఆయా మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు కూడా ప్రయోజనం చేకూరుస్తాయి.
Also Read: PM Modi: ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం.. త్వరలో కమిటీ ఏర్పాటు
ప్రయాణీకుల అదనపు రద్దీకి సంబంధించి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, రైళ్లను సమయానుకూలంగా నడిపేందుకు సకాలంలో చర్యలు తీసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ డివిజనల్ రైల్వే మేనేజర్లు, డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ హెడ్లను ఆదేశించారు. స్టేషన్లలో రద్దీని పర్యవేక్షించాలని , తద్వారా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానం చేరుకునేలా రైళ్ల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
తాజావార్తలు
-
Spicy Idli Chaat Recipe: మిగిలిన ఇడ్లీలతో సూపర్ స్పైసీ చాట్.. 5 నిమిషాల్లో రెడీ..!
-
Akash Goparaju: కోనసీమ బ్యాక్డ్రాప్లో సింగర్ సునీత కొడుకు ‘కొత్త మలుపు’
-
Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్గా ప్రకటించిన డైరెక్టర్!
-
India Job Crisis: ఇంజనీరింగ్ చేసి స్వీపర్ పోస్టులకు అప్లై చేస్తున్నారు.. ఇక డిగ్రీలు దండగేనా?
-
POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!