Thummala Nageswara Rao: సోనియా గాంధీ, ఖర్గే ఎంపిక చేసిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోనియా, ఖర్గే ఎంపిక చేశారని.. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన మంత్రి మాట్లాడారు. ” పోరాటం చేసే సత్తా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఉందని నిరూపిద్దాం. అభ్యర్థి ఎవరైనా సరే పార్టీ ఆదేశాలను అమలు చేసే కార్యకర్తలు, నాయకులు ఉండటం కాంగ్రెస్ పార్టీ అదృష్టం. అధికార పార్టీ బెదిరింపులకు, కేసులకు భయపడకుండా ఒంటరి పోరాటం చేసిన వ్యక్తి మల్లన్న. మూడు జిల్లాల్లో ఉన్న ఎంఎల్ఏ లు మెజారిటీ ఇస్తాం అంటున్నారు.. మన డోర్నకల్ నియోజకవర్గం ఎక్కువ ఇవ్వాలి.
మీరిచ్చిన మనో ధైర్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మా వంతు కృషి చేస్తాం” అని మంత్రి వ్యాఖ్యానించారు.
READ MORE: Baby Kidnap: వస్తువులు అమ్మే వారితో జాగ్రత్త.. ఇంట్లోకి ప్రవేశించి చిన్నారిని ఎత్తుకెళ్లిన దొంగ
Also Read
- Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
- 185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా రైతుల మనో ధైర్యం దెబ్బతీసే విధంగా మాట్లతున్నారని మంత్రి నాగేశ్వరరావు అన్నారు. “అయినా సరే మొలకలు వచ్చిన ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించాం. గతంలో 45 రోజుల్లో రైతులకు డబ్బులేశారు. మేము 4 రోజుల్లో వేస్తున్నాం. సన్న వడ్లకు బోనస్ ఇచ్చాం. దొడ్డు వడ్లు కు కూడా బోనస్ ఇస్తామని తెలియచేస్తున్న. మల్లన్నకు మద్దతు ఇవ్వాలి” అని పేర్కొన్నారు. మీరు ఎప్పటి లాగే గత ప్రభుత్వంను నిలదీసినట్లె తప్పు చేసిన ప్రభుత్వాన్ని నిలదీయాలని మల్లన్నను మంత్రి తుమ్మల కోరారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రామచందర్ నాయక్, మంత్రి తుమ్మల, ఎమ్మెల్సి అభ్యర్థి తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు.
తాజావార్తలు
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!