బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా.. మోడీ ప్రమాణస్వీకారానికి ఒకరోజు ముందుగానే శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఆదివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన మోడీ ప్రమాణస్వీకారానికి షేక్ హసీనా పాల్గొన్నారు. సోమవారం కూడా ఆమె పర్యటన ఢిల్లీలో కొనసాగుతోంది.
భారత్ పర్యటనలో భాగంగా షేక్ హసీనా సోమవారం మధ్యాహ్నం… కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను బంగ్లాదేశ్ ప్రధాని ఢిల్లీలో కలిశారు. సోనియా నివాసానికి వెళ్లి ప్రత్యేకంగా పలకరించారు. అంతేకాదు సోనియా, ప్రియాంక, రాహుల్ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం తాజా పరిణామాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే యోగక్షేమాలు గురించి కూడా ఒకరినొకరు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇదిలా ఉంటే ఆదివారం కేంద్రంలో మోడీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. 72 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి 293 స్థానాలు గెలుచుకుంది. ఇక బీజేపీ సొంతంగా 240 సీట్లు దక్కించుకుంది. మ్యాజిక్ ఫిగర్ మాత్రం చేరుకోలేకపోయింది. మోడీ ప్రమాణస్వీకారానికి విదేశీ ప్రముఖులు హాజరయ్యారు.
Congress Parliamentary Party Chairperson Sonia Gandhi, party MP Rahul Gandhi and General Secretary Priyanka Gandhi Vadra called on the Prime Minister of Bangladesh Sheikh Hasina this afternoon in Delhi.
(Pics: AICC) https://t.co/2yXmFa2Bkk pic.twitter.com/aoiBr4Ps0u
— ANI (@ANI) June 10, 2024