Sonakshi Sinha: పెళ్లి తర్వాత సోనాక్షి సిన్హా ఇస్లాంలోకి మారుతుందా..? జహీర్ ఇక్బాల్ తండ్రి సంచలన ప్రకటన..
- పెళ్లి తర్వాత సోనాక్షి ఇస్లాంలోకి మారుతుందా..?
- జహీర్ ఇక్బాల్ని వివాహం చేసుకోనున్న సోనాక్షి..
- మతమార్పిడిపై జహీర్ తండ్రి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonakshi Sinha: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ని ఈ నెలలో పెళ్లి చేసుకోబోతోంది. సోనాక్షి,జహీర్ ఇక్బాల్ కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. తాజాగా వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. పెళ్లికి సంబంధించిన వివరాలను సోనాక్షి తండ్రి శత్రుఘ్ను సిన్హా సన్నిహితుడు శశి రంజన్ పంచుకున్నారు. ఈ పెళ్లికి శత్రుఘ్ను సిన్హా సోదరులు అమెరికా నుంచి వస్తున్నట్లు ఆయన వెళ్లడించారు. జహీర్ ఇక్బాల్ ఇంట్లో రిజస్టర్ మ్యారేజ్ జరుగుతుందని, ఇది తమ కుటుంబాలకు సంతోషకమైన క్షణమని అన్నారు.
Read Also: Petrol price hike: గోవాలోనూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Also Read
ఇదిలా ఉంటే సోనాక్షి సిన్హా తల్లి, సోదరుడు ఆమెను ఇన్స్టాగ్రామ్లో అన్ ఫాలో చేసినట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరికి ఈ పెళ్లి ఇష్టం లేదనే వార్తలు వినిపించాయి. అయితే వీటిని శత్రఘ్ను సిన్హా కొట్టిపారేశారు. గతంలో ఈ వివాహానానికి శత్రఘ్ను సిన్హా కూడా హాజరుకావడం లేదని పుకార్లు వచ్చాయి. వీటిని ఖండిస్తూ, ఇది నా ఏకైక కుమార్తె సోనాక్షి వివాహమని, పెళ్లికి ఖచ్చితంగా తాను ఉంటానని చెప్పారు. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మెహందీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఇదిలా ఉంటే జహీర్ ఇక్బాల్తో పెళ్లి తర్వాత సోనాక్షి సిన్హా ఇస్లాం మతంలోకి మారుతారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో జహీర్ తండ్రి ఇక్బాల్ రతాన్సీ సంచలన ప్రకటన చేశారు. పెళ్లి తర్వాత సోనాక్షి ఇస్లాంలోకి మారుతుందనే వార్తల్ని ఆయన తోసిపుచ్చారు. ఈ పెళ్లి హిందూ లేదా ఇస్లాం సంప్రదాయాన్ని కలిగి ఉండదని, ఇది సివిల్ మ్యారేజ్ అని చెప్పారు. ఆమె మతం మారడం లేదని, ఇది ఖచ్చితమని చెప్పారు. వారి హృదయాల కలయి, మతానికి ఇందులో ఎలాంటి పాత్ర లేదని చెప్పారు. నేను మానవత్వాన్ని నమ్ముతానని, దేవుడిని హిందువులు భగవాన్ అని, ముస్లింలు అల్లాని పిలుస్తారని, కానీ చివరికి మనమంతా మనుషులమని చెప్పారు. తన ఆశీస్సులు జహీర్, సోనాక్షిలకు ఉంటాయని అన్నారు. 2020 నుంచి సోనాక్షి, జహీర్ ఇద్దరు డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వారు 2022లో డబుల్ ఎక్స్ఎల్ సినమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!