Haryana: గ్రేట్.. పుల్వామా దాడిలో అమరుడైన జవాన్ కుమారుడు.. అండర్-19 జట్టుకు ఎంపిక
- పుల్వామా దాడి జరిగి నిన్నటికీ ఆరేళ్లు
- అమరులైన 40 మంది జవాన్లు
- అండర్-19కి ఎంపికైన ఓ జవాన్ కుమారుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుల్వామాలో ఉగ్రవాద దాడి జరిగి ఆరు సంవత్సరాలు గడిచాయి. ఫిబ్రవరి 14, 2019న, జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాది పేలుడు పదార్థాలు నిండిన వాహనంతో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు్ను ఢీకొట్టాడు. దీంతో భారీ పేలుడు సంభవించింది. ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ సైనికులు అమరులయ్యారు. ఈ దాడి తర్వాత టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన జవాన్ల పిల్లల చదువు ఖర్చులను బరించే బాధ్యతను సెహ్వాగ్ తీసుకున్నాడు.
READ MORE: Jaggery: చక్కెర కంటే బెల్లం ఆరోగ్యానికి మంచిదా?
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
కాగా.. అమరులైన వారిలో విజయ్ సోరెంగ్ జవాన్ కూడా ఉన్నారు. అమరుడు విజయ్ సోరెంగ్ కుమారుడు…రాహుల్ సోరెంగ్. రాహుల్ ఇప్పుడు క్రికెట్ లో రాణిస్తున్నాడు. రాహుల్ సోరెంగ్ ఇటీవలే హర్యానా అండర్-19 జట్టులోకి ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని వీరేంద్ర సెహ్వాగ్ స్వయంగా తెలిపారు. పుల్వామా దాడి జరిగి ఆరేళ్లయిన సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను పంచుకున్నారు. “పుల్వామా దాడి జరిగి 6 సంవత్సరాలు అయింది. మన వీర సైనికుల బలిదానాన్ని భర్తీ చేయలేం. కానీ.. రాహుల్ సోరెంగ్ S/O షహీద్ విజయ్ సోరెంగ్, అర్పిత్ సింగ్ S/O షహీద్ రామ్ వకీల్ గత 5 సంవత్సరాలుగా సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు. ఇది నాకు అత్యంత సంతృప్తినిచ్చింది. రాహుల్ ఇటీవలే హర్యానా అండర్-19 జట్టులోకి ఎంపికయ్యాడు.” అని సెహ్వాగ్ పేర్కొన్నారు.
READ MORE: CM Revanth Reddy: నేను కొందరికి నచ్చకపోవచ్చు.. నా పని నేను చేస్తున్నా
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!