Lucknow: భార్య కాపురానికి రావడం లేదని.. అత్తమామలపై అల్లుడు దారుణం..
- భార్య కాపురానికి రావడం లేదని
- అత్తమామలపై దారుణం
- అత్తమామలను కత్తితో పొడిచి చంపాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లక్నోలోని అలంబాగ్ విజయ్ ఖేడా తూర్పులో ప్రాంతంలో తన భార్య కాపురానికి రావడం లేదని ఓ అల్లుడు దారుణానికి ఒడిగట్టాడు. అత్తమామలను కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన స్థానికింగా సంచలం సృష్టించింది. కుటుంబ వివాదం కారణంగా జరిగిన ఈ జంట హత్య ఆ ప్రాంతంలో భయాందోళనలు రేకెత్తించింది. ఈ సంఘటన తర్వాత స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మొత్తం కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి తన భార్యతో గొడవలు జరుగుతున్నాయని, దీంతో భార్య తన తల్లిదండ్రుల ఇంట్లో నివసిస్తుందని పోలీసులు చెబుతున్నారు.
Also Read:What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
- PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
విజయఖేడ తూర్పు ఏరియాకు చెందిన 80 ఏళ్ల అనంత్ రామ్ తన 75 ఏళ్ల భార్య ఆశాదేవితో నివసిస్తున్నాడు. దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం, అతను తన కుమార్తె పూనమ్ను నిషాత్గంజ్ నివాసి జగదీప్ సింగ్తో వివాహం చేశాడు. కొంతకాలం నుంచి అతని కుమార్తె జగదీప్తో గొడవ పడుతోంది. బుధవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో, జగదీప్ తన అత్తమామల ఇంటికి వెళ్లి పూనమ్ను ఇంటికి రమ్మని కోరాడు. పూనమ్ వెళ్ళడానికి నిరాకరించింది.
Also Read:Mali-India: మాలిలో ముగ్గురు భారతీయుల కిడ్నాప్.. చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్
ఇంతలో, అనంత్ రామ్ జగదీప్ తో వాగ్వాదానికి దిగాడు. దీంతో కోపంతో ఊగిపోయిన జగదీప్ కత్తి తీసి తన మామ మెడపై దాడి చేశాడు. అనంత్ రామ్ రక్తపు మడుగులో నేలపై పడిపోయాడు. ఆశా అతన్ని రక్షించడానికి వచ్చినప్పుడు, జగదీప్ ఆమెపై కూడా దాడి చేశాడు. అల్లుడు దాడి చేస్తున్న సమయంలో అత్తమామల అరుపులు కేకలు విని ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. నిందితుడు జగదీప్ ను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. అలంబాగ్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని డీసీపీ ఆశిష్ శ్రీవాస్తవ తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!