Lucknow: భార్య కాపురానికి రావడం లేదని.. అత్తమామలపై అల్లుడు దారుణం..
- భార్య కాపురానికి రావడం లేదని
- అత్తమామలపై దారుణం
- అత్తమామలను కత్తితో పొడిచి చంపాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లక్నోలోని అలంబాగ్ విజయ్ ఖేడా తూర్పులో ప్రాంతంలో తన భార్య కాపురానికి రావడం లేదని ఓ అల్లుడు దారుణానికి ఒడిగట్టాడు. అత్తమామలను కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన స్థానికింగా సంచలం సృష్టించింది. కుటుంబ వివాదం కారణంగా జరిగిన ఈ జంట హత్య ఆ ప్రాంతంలో భయాందోళనలు రేకెత్తించింది. ఈ సంఘటన తర్వాత స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మొత్తం కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి తన భార్యతో గొడవలు జరుగుతున్నాయని, దీంతో భార్య తన తల్లిదండ్రుల ఇంట్లో నివసిస్తుందని పోలీసులు చెబుతున్నారు.
Also Read:What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
విజయఖేడ తూర్పు ఏరియాకు చెందిన 80 ఏళ్ల అనంత్ రామ్ తన 75 ఏళ్ల భార్య ఆశాదేవితో నివసిస్తున్నాడు. దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం, అతను తన కుమార్తె పూనమ్ను నిషాత్గంజ్ నివాసి జగదీప్ సింగ్తో వివాహం చేశాడు. కొంతకాలం నుంచి అతని కుమార్తె జగదీప్తో గొడవ పడుతోంది. బుధవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో, జగదీప్ తన అత్తమామల ఇంటికి వెళ్లి పూనమ్ను ఇంటికి రమ్మని కోరాడు. పూనమ్ వెళ్ళడానికి నిరాకరించింది.
Also Read:Mali-India: మాలిలో ముగ్గురు భారతీయుల కిడ్నాప్.. చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్
ఇంతలో, అనంత్ రామ్ జగదీప్ తో వాగ్వాదానికి దిగాడు. దీంతో కోపంతో ఊగిపోయిన జగదీప్ కత్తి తీసి తన మామ మెడపై దాడి చేశాడు. అనంత్ రామ్ రక్తపు మడుగులో నేలపై పడిపోయాడు. ఆశా అతన్ని రక్షించడానికి వచ్చినప్పుడు, జగదీప్ ఆమెపై కూడా దాడి చేశాడు. అల్లుడు దాడి చేస్తున్న సమయంలో అత్తమామల అరుపులు కేకలు విని ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. నిందితుడు జగదీప్ ను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. అలంబాగ్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని డీసీపీ ఆశిష్ శ్రీవాస్తవ తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!