Lucknow: భార్య కాపురానికి రావడం లేదని.. అత్తమామలపై అల్లుడు దారుణం..
- భార్య కాపురానికి రావడం లేదని
- అత్తమామలపై దారుణం
- అత్తమామలను కత్తితో పొడిచి చంపాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లక్నోలోని అలంబాగ్ విజయ్ ఖేడా తూర్పులో ప్రాంతంలో తన భార్య కాపురానికి రావడం లేదని ఓ అల్లుడు దారుణానికి ఒడిగట్టాడు. అత్తమామలను కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన స్థానికింగా సంచలం సృష్టించింది. కుటుంబ వివాదం కారణంగా జరిగిన ఈ జంట హత్య ఆ ప్రాంతంలో భయాందోళనలు రేకెత్తించింది. ఈ సంఘటన తర్వాత స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మొత్తం కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి తన భార్యతో గొడవలు జరుగుతున్నాయని, దీంతో భార్య తన తల్లిదండ్రుల ఇంట్లో నివసిస్తుందని పోలీసులు చెబుతున్నారు.
Also Read:What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Skincare Tips: బ్యూటీ పార్లర్కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
- Nepal Floods: "నువ్వు దేవుడు సామీ".. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
విజయఖేడ తూర్పు ఏరియాకు చెందిన 80 ఏళ్ల అనంత్ రామ్ తన 75 ఏళ్ల భార్య ఆశాదేవితో నివసిస్తున్నాడు. దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం, అతను తన కుమార్తె పూనమ్ను నిషాత్గంజ్ నివాసి జగదీప్ సింగ్తో వివాహం చేశాడు. కొంతకాలం నుంచి అతని కుమార్తె జగదీప్తో గొడవ పడుతోంది. బుధవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో, జగదీప్ తన అత్తమామల ఇంటికి వెళ్లి పూనమ్ను ఇంటికి రమ్మని కోరాడు. పూనమ్ వెళ్ళడానికి నిరాకరించింది.
Also Read:Mali-India: మాలిలో ముగ్గురు భారతీయుల కిడ్నాప్.. చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్
ఇంతలో, అనంత్ రామ్ జగదీప్ తో వాగ్వాదానికి దిగాడు. దీంతో కోపంతో ఊగిపోయిన జగదీప్ కత్తి తీసి తన మామ మెడపై దాడి చేశాడు. అనంత్ రామ్ రక్తపు మడుగులో నేలపై పడిపోయాడు. ఆశా అతన్ని రక్షించడానికి వచ్చినప్పుడు, జగదీప్ ఆమెపై కూడా దాడి చేశాడు. అల్లుడు దాడి చేస్తున్న సమయంలో అత్తమామల అరుపులు కేకలు విని ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. నిందితుడు జగదీప్ ను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. అలంబాగ్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని డీసీపీ ఆశిష్ శ్రీవాస్తవ తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!