Lucknow: భార్య కాపురానికి రావడం లేదని.. అత్తమామలపై అల్లుడు దారుణం..
- భార్య కాపురానికి రావడం లేదని
- అత్తమామలపై దారుణం
- అత్తమామలను కత్తితో పొడిచి చంపాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లక్నోలోని అలంబాగ్ విజయ్ ఖేడా తూర్పులో ప్రాంతంలో తన భార్య కాపురానికి రావడం లేదని ఓ అల్లుడు దారుణానికి ఒడిగట్టాడు. అత్తమామలను కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన స్థానికింగా సంచలం సృష్టించింది. కుటుంబ వివాదం కారణంగా జరిగిన ఈ జంట హత్య ఆ ప్రాంతంలో భయాందోళనలు రేకెత్తించింది. ఈ సంఘటన తర్వాత స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మొత్తం కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి తన భార్యతో గొడవలు జరుగుతున్నాయని, దీంతో భార్య తన తల్లిదండ్రుల ఇంట్లో నివసిస్తుందని పోలీసులు చెబుతున్నారు.
Also Read:What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
- Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
- Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
- AAP: ప్రధాని నివాసం ముందు ధర్నా.. కాంగ్రెస్పై ఆప్ ఎదురుదాడి
విజయఖేడ తూర్పు ఏరియాకు చెందిన 80 ఏళ్ల అనంత్ రామ్ తన 75 ఏళ్ల భార్య ఆశాదేవితో నివసిస్తున్నాడు. దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం, అతను తన కుమార్తె పూనమ్ను నిషాత్గంజ్ నివాసి జగదీప్ సింగ్తో వివాహం చేశాడు. కొంతకాలం నుంచి అతని కుమార్తె జగదీప్తో గొడవ పడుతోంది. బుధవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో, జగదీప్ తన అత్తమామల ఇంటికి వెళ్లి పూనమ్ను ఇంటికి రమ్మని కోరాడు. పూనమ్ వెళ్ళడానికి నిరాకరించింది.
Also Read:Mali-India: మాలిలో ముగ్గురు భారతీయుల కిడ్నాప్.. చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్
ఇంతలో, అనంత్ రామ్ జగదీప్ తో వాగ్వాదానికి దిగాడు. దీంతో కోపంతో ఊగిపోయిన జగదీప్ కత్తి తీసి తన మామ మెడపై దాడి చేశాడు. అనంత్ రామ్ రక్తపు మడుగులో నేలపై పడిపోయాడు. ఆశా అతన్ని రక్షించడానికి వచ్చినప్పుడు, జగదీప్ ఆమెపై కూడా దాడి చేశాడు. అల్లుడు దాడి చేస్తున్న సమయంలో అత్తమామల అరుపులు కేకలు విని ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. నిందితుడు జగదీప్ ను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. అలంబాగ్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని డీసీపీ ఆశిష్ శ్రీవాస్తవ తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
-
Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
-
El Nino : ఎల్నీనో ఎఫెక్ట్.. తెలంగాణలో డ్రౌట్ అలర్ట్.!
-
Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
-
AAP: ప్రధాని నివాసం ముందు ధర్నా.. కాంగ్రెస్పై ఆప్ ఎదురుదాడి
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!