Tragedy: పశ్చిమ బెంగాల్లో విషాదం.. తల్లి శవాన్ని 50కి.మీ. మోసిన కొడుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: పశ్చిమ బెంగాల్లోని జల్పైగురిలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. అంబులెన్స్ డ్రైవర్ అధిక డబ్బులు డిమాండ్ చేయడంతో తన తల్లి మృతదేహాన్ని భుజాలపై మోయవలసి వచ్చింది. దాదాపు 50 కిలోమీటర్ల పాటు తన తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లాగు. వాస్తవానికి, అంబులెన్స్ డ్రైవర్ నిర్ణీత రుసుం కంటే దాదాపు మూడు రెట్లు డిమాండ్ చేశాడు.
Read Also : Prince Harry : మా అన్న నన్ను పడేసి తన్నాడు.. అందుకే నడుం నొప్పి వచ్చింది
Also Read
- Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
- 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
- Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
జల్పాయిగురి జిల్లా కేకే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఓ మహిళ ఉదయం 10:30 గంటల ప్రాంతంలో కన్నుమూసింది. తల్లిని పోగొట్టుకున్న బాధలో ఉన్న కొడుకు మృతదేహాన్ని పశ్చిమ బెంగాల్లోని జల్పైగురి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ డ్రైవర్ ను ఆశ్రయించాడు. కానీ, అతడు నిర్ణీత రుసుం రూ.900కు బదులు రూ.3వేలకు పైగా అడిగాడు. అది చెల్లించలేని కొడుకు తన తండ్రితో కలిసి ఆమె మృతదేహాన్ని భుజాలపై ఎత్తుకుని గ్రామానికి కాలినడకన బయలుదేరారు. దాదాపు 50 కిలోమీటర్లు నడిచాడు. మరణించిన మహిళ కుమారుడు జై కృష్ణ దివాన్ మాట్లాడుతూ, “నేను మా అమ్మను ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు, అంబులెన్స్ డ్రైవర్ రూ. 900 తీసుకున్నాడు. అయితే, మృతదేహాన్ని తీసుకెళ్లడానికి మాత్రం రూ. 3000 డిమాండ్ చేశాడు. ఇంకొంచెం డబ్బులు తీసుకోమని చెప్పాను కానీ వాడు ఒప్పుకోలేదని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.
The Pope Emeritus Benedict XVI : పోప్ బెనడిక్ట్కు తుది వీడ్కోలు
ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్, హాస్పిటల్ టై-అప్ అయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా దేశంలో చాలా చోట్ల ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ నిర్లక్ష్యానికి, పరిపాలన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఒడిశా నుంచి కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఆగస్టులో, మాఝీ అనే వ్యక్తి తన చనిపోయిన భార్య మృతదేహాన్ని తన భుజాలపై అనేక కిలోమీటర్లు మోసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో అతని చిన్న కుమార్తె కూడా అతనితో ఉంది. ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. చనిపోయిన కుమారుడిని ఆసుపత్రి నుండి 90 కిలోమీటర్ల దూరంలోని ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ డ్రైవర్ రూ.20,000 డిమాండ్ చేశాడు. తండ్రి బస్ వెనుక సీట్లో కూర్చుని కుమారుడి మృతదేహాన్ని తరలించాడు.
తాజావార్తలు
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!