Sanjay Raut: కొంతమంది రెబల్ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా తిరిగి వస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: కొంతమంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వస్తారని శివసేన (ఉద్ధవ్ వర్గం) నాయకుడు సంజయ్ రౌత్ శుక్రవారం ప్రకటించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద బెయిల్పై విడుదలైన రెండు రోజుల తర్వాత మాట్లాడుతూ, అటువంటి కేసులన్నింటినీ సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలించాలని కూడా అన్నారు. ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో సహా 40 మంది శివసేన ఎమ్మెల్యేలు జూన్లో పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేయడంతో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది.
“వారిలో కొందరు ఖచ్చితంగా తిరిగి వస్తారు. మరికొందరు తిరిగి వస్తారని నాకు నమ్మకం ఉంది” అని సంజయ్ రౌత్ అన్నారు.తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీని వీడడానికి కారణాలు చెబుతున్నారన్నారు.పీఎంఎల్ఏ కేసుల్లో శీఘ్ర బెయిల్కు అవకాశం లేదని, రాజకీయ పగతో ఇలాంటి కేసులు చాలా వరకు నమోదయ్యాయని రాజ్యసభ ఎంపీ తెలిపారు. ఈ కేసులను పరిశీలించేందుకు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా విపక్ష సభ్యుల అధిక ప్రాతినిధ్యంతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ బెంచ్ ఉండాలని సంజయ్ రౌత్ చెప్పారు. బీజేపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్పై తనకు ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదని రౌత్ చెప్పారు. పేదలకు గృహనిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలకు ఫడ్నవీస్ను ఆయన అభినందించారు.
Also Read
- India’s 80-Year Sports Journey: హాకీ స్వర్ణయుగం నుంచి క్రికెట్ సామ్రాజ్యం వరకు.. 80 ఏళ్ల భారత క్రీడా ప్రస్థానం..
- CM Revanth Reddy: నియామకాలను బాధ్యతగా తీసుకున్నాం.. 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం..
- CM Revanth Reddy: రాష్ట్రంలో 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేశాం..
- Cyberabad: దారుణం.. ఆలయంలో మైనర్ బాలికపై పూజారి లైంగిక దాడి.!
కేంద్రంపై దాడి చేస్తూ, దేశంలో రాజకీయ శత్రువును దేశానికి శత్రువుగా చూసే పరిస్థితి ఉందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు శాశ్వతంగా ముగించే పరిస్థితులు దేశంలో కనిపిస్తు్న్నాయని రౌత్ అన్నారు.దేశంలో ఇలాంటి వాతావరణం ఎప్పుడూ లేదని ఆయన అన్నారు. ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత ఏడాది కంటే ఎక్కువ కాలం జైలు నుంచి బయటకు రాలేడని అన్నారని రౌత్ చెప్పారు.ఒక గంట జైలులో ఉండటం 100 రోజులకు సమానం, ఎందుకంటే ఒకరికి లోపల ఎటువంటి సౌకర్యాలు లేవు, అని సేన నాయకుడు తెలిపారు. భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో తాను భారత్ జోడో యాత్రలో పాల్గొంటానని, ఇది ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి సమానమని ఆయన అన్నారు.
రాహుల్ గాంధీ, ఆదిత్య ఠాక్రే దేశాన్ని నడిపించగల సమర్థులు
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, శివసేన నాయకుడు ఆదిత్య ఠాక్రేలు దేశాన్ని నడిపించగల సామర్థ్యం ఉన్న ఇద్దరు ప్రముఖ యువ నాయకులు అని రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం అన్నారు. అంతకుముందు రోజు గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఠాక్రే పాల్గొన్నారు. మనీలాండరింగ్ కేసులో బెయిల్ పొంది జైలు నుంచి విడుదలైన రౌత్, భారత్ జోడో యాత్రలో శివసేన భాగమని చెప్పారు. రాష్ట్రం, దేశం కోసం పని చేసే శక్తి వారికి (రాహుల్ గాంధీ, ఆదిత్య ఠాక్రే) చాలా ఎక్కువ అని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వాతావరణం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనను పెద్ద శక్తిగా మారుస్తుందని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
India’s 80-Year Sports Journey: హాకీ స్వర్ణయుగం నుంచి క్రికెట్ సామ్రాజ్యం వరకు.. 80 ఏళ్ల భారత క్రీడా ప్రస్థానం..
-
Bhargav BV: కన్నడ సుప్రీమ్ స్టార్ కొత్త ప్రయాణం… క్లాసిక్ టైటిల్తో హీరోగా, దర్శకుడిగా తెలుగు సినిమా
-
CM Revanth Reddy: నియామకాలను బాధ్యతగా తీసుకున్నాం.. 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం..
-
LPG e-KYC deadline 2026: ఆగస్టు 16 తర్వాత LPG సిలిండర్ రాదా?.. e-KYC తప్పనిసరి.. పూర్తి వివరాలు
-
CM Revanth Reddy: రాష్ట్రంలో 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేశాం..
ట్రెండింగ్
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!